-
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు
ఈలలు.. కేకలు.. చప్పట్లతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఎందుకంటే... ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణల ఊర మాస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు.. నేను రోమియోగ మారినది లగాయితు....’ రీమిక్స్లో నాగచైతన్య, నిధి అగర్వాల్ చిందేయనున్నారు. అవును.. ‘సవ్యసాచి’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. తొంభై శాతం చిత్రీకరణ పూరై్తంది. ఒక సాంగ్తో పాటు మూడు సీన్లను చిత్రీకరించేందుకు చిత్రబృందం యూఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. మే 3 నుంచి 15వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’ సాంగ్ రీమిక్స్ని చిత్రీకరించనున్నారు. అప్పుడు ‘అల్లరి అల్లుడు’కి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘సవ్యసాచి’కి మణిశర్మ స్వరకర్త. ఈ రీమిక్స్ సాంగ్ మణిశర్మ స్టైల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో నాగ్–రమ్యల స్టెప్స్ అదుర్స్. ఇప్పుడు చైతూ–నిధి కూడా అదిరిపోయేలా స్టెప్స్ వేస్తారని ఊహించవచ్చు. -
అల్లరి అల్లుడు?
త్వరలో చెన్నై అల్లుడు కానున్న నాగచైతన్య ప్రేక్షకుల ముందుకూ అల్లుడిగానే రానున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘అల్లరి అల్లుడు’ టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్నగర్ సమాచారం. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా టైటిల్ ఇది. టైటిలే కాదు... ‘అల్లరి అల్లుడు’లోని సూపర్హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసిన ది లగాయిత్తు..’ చైతూ సినిమాలో ప్రేక్షకులకు వినిపించనుందట! హీరో ఇంట్రడక్షన్ సీన్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్గా ఈ సాంగ్ వచ్చేలా ప్లాన్ చేశారట. దీంతో పాటు ‘హలో బ్రదర్’లోని సూపర్హిట్ సాంగ్ ‘ప్రియరాగాలే గుండెలోన..’ను కూడా రీమిక్స్ చేస్తున్నారని వినికిడి. ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే చాలా వరకూ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
నాగ్ టైటిల్తో నాగచైతన్య..?
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల సక్సెస్తో మంచి ఊపు మీదున్న నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా లాంటి బిగ్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణ.. నాగచైతన్య కోసం నిన్నేపెళ్లాడతా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు నాగార్జున హీరోగా తెరకెక్కిన అల్లరి అల్లుడు టైటిల్ను తీసుకోవాలని భావిస్తున్నారట. 90లలో ఘనవిజయం సాధించిన ఈ టైటిల్ చైతన్య సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, నాగ్ కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో ఒక్కటిగా నిలిచిన హలోబ్రదర్ సినిమాలోని ప్రియరాగాలే పాటను రిమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికి ఈ టైటిల్పై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వకాపోయినా.. అక్కినేని అభిమానులు మాత్రం నాగ్ టైటిల్కే ఓటేస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్లోకి డైరెక్టర్గా ఎంట్రీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
తప్పక చదవండి
- ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
- ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- ‘కవిత అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement