breaking news
allam rajaiah
-
ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ షాక్ ట్రీట్మెంట్..
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ సీట్లు రాని కొందరు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలం మాకు సీటివ్వరా అంటూ రోదిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చారు గులాబీ దళపతి. ఒక సీటును సిటింగ్ను కాదని ఎమ్మెల్సీతో భర్తీ చేశారు. మరో సీటును సిటింగ్కు ప్రకటించకుండా పెండింగ్లో పెట్టారు. సీట్లు రాని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు విలపించడంతో వారి అనుచరులు కూడా కంటతడి పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను అయోమయానికి గురిచేస్తుంది. రాజకీయంగా నాటకీయ పరిణామాలకు దారి తీస్తోంది. జనగామ, స్టేషన్ ఘనపూర్ టికెట్లు అక్కడి ఎమ్మెల్యేలను కన్నీరు మున్నీరుగా విలపించే పరిస్థితి తీసుకొచ్చాయి. అందరూ ఉహించినట్లుగానే స్టేషన్ ఘనపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. స్వయం కృతాపరాధంతో టికెట్ కోల్పోయిన రాజయ్య భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. జరిగిన పరిణామాలను తలుచుకుంటూ కార్యకర్తలను పట్టుకుని బోరున విలపిస్తున్నారు. నేలపై పడుకుని సాష్టాంగ నమస్కారంతో పశ్చాత్తాపం చెందుతున్నారు. టికెట్ రాకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు. కొందరు పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారు. అయితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాత్రం అధినేతను కలిసిన తర్వాత సైలెంట్ అయిపోయారు. కెసిఆర్ గీసిన గీతను దాటనని, తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని చెబుతున్నారు. తనకు కేసిఆర్ ఆశీస్సులున్నందున.. ఆందోళన చెందకుండా అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు. డాక్టరయిన తనకు స్థాయికి తగ్గ స్థానం కేసీఆర్ కల్పిస్తారనే నమ్మకం ఉందంటున్నారు. చదవండి: పల్లాపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇక జనగామ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టికెట్ పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెరపైకి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పేర్లు రావడంతో పల్లా వద్దు.. ముత్తిరెడ్డే ముద్దు అంటూ ఆయన అనుచరులు ఆందోళనకు దిగి కన్నీటి పర్యంతమయ్యారు. మా బాపుకు అన్యాయం చెయ్యొద్దు అంటు ముత్తిరెడ్డిని పట్టుకుని బోరున విలపించారు. కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ముత్తిరెడ్డి సైతం కన్నీటి పర్యంతమై ఒక్క అవకాశం ఇవ్వండని రెండు చేతులు జోడించి దండం పెడుతూ కేసీఆర్ను వేడుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన అధికారం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెక్కి వెక్కి ఏడ్వడం ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా కలకలం రేపింది. మరి ఎమ్మెల్యేల కన్నీరు గులాబీ దళపతిని కరిగిస్తుందా? వారి అనుచరుల ఆవేదన ఫలితాన్నిస్తుందా? కొద్ది రోజుల తర్వాత గాని ఏ విషయం తెలిసే అవకాశం లేదు. -
నదిలో ఈత ఒడ్డున ఆట
అల్లం రాజయ్య... తెలుగు సాహిత్యంలో తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిన రచయిత రాత... చేత ఒక్కటై నడుస్తున్న వ్యక్తి! సామాజికార్థిక అంశాలే ఆయన కథలకు నేపథ్యాలు! ఈ చైతన్య స్రవంతి గోదావరితో తన జ్ఞాపకాలను పంచుకున్నారిలా... నేను పుట్టింది మంథని (కరీంనగర్ జిల్లా)దగ్గరున్న గాజులపల్లిలో. గోదావరి మా ఊరికి ఆరు కిలోమీటర్లు. మా ప్రాంతంలో శివభక్తులు ఎక్కువ. ప్రతి శివరాత్రికి దాదాపు వంద గ్రామాలవాళ్లు గోదావరికి వచ్చేవాళ్లు స్నానాల కోసం. మా చిన్నప్పుడు అదో అద్భుతమైన జ్ఞాపకం. తెల్లవారు జామున నాలుగు గంటలకే లేచి కచ్చడాలు కట్టుకొని అందరం గోదావరికి వేళ్లేవాళ్లం. ఎడ్లబళ్లు వరుసగా బారులు తీరి వెళ్తుంటే భలేగుండేది. హోలీ పండుగకైతే మా ఆటలన్నీ గోదావరితోనే. హైస్కూల్ వరకు మంథనిలో చదివాను. మంథనికి గోదావరి కిలోమీటరే. టైమ్ దొరికితే చాలు పిల్లలమంతా కలసి గోదావరికి వెళ్లేవాళ్లం. నదిలో ఈతలు... నది ఒడ్డున ఆటలు. ఊహ తెలిశాక... గోదావరితో పరిచయం వేరు. అది నేర్పే పాఠాలు వేరు. ఊహ తెలిశాక గోదావరి ఎన్నో పాఠాలు నేర్పడం మొదలు పెట్టింది. చుట్టూ అంత పెద్ద ప్రవాహం ఉన్నా పంటలకు చుక్క నీరందని పరిస్థితి..? ఎందుకు? అన్న ఆలోచన వచ్చింది. ప్రశ్నించడం స్టార్ట్ చేసి పోరాటం చేసే స్థాయికి వెళ్లాం. ‘మా నీళ్లు మాకెందుకివ్వరు’ అన్నది చాలా జన్యూన్ కాజ్! సమస్యను పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణచివేశారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం రైతుసంఘాలు పెట్టాం. సాహిత్య వేదికగా ప్రజాఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న విప్లవ రచయిత అల్లం రాజయ్య. ఆయన ప్రతి రచనా చైతన్య స్ఫూర్తే! అతడు, మహదేవుని కల, మనిషిలోపలి విధ్వంసం వంటి వంద కథలు, కొలిమంటుకుంది, ఊరు, అగ్నికణం, వసంతగీతం, కొమురం భీం వంటి నవలలూ రాశారు. గోదావరి పేరుతో... 1975లో ఉద్యోగ నిమిత్తం గోదావరి అవతలి నుంచి ఇవతలికి వచ్చాను. అంటే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాను. అక్కడున్నప్పుడే ‘గోదావరి’ కలం పేరుతో పొయెట్రీ రాశాను. కథలు రాశాను. కథల్లోను గోదావరి ఉండేది. ఆ మాటకొస్తే తెలంగాణ గోదావరి... వేల ఏళ్ల కిందటే అద్భుతమైన సాహిత్యాన్నిచ్చింది. అన్వేషణను నేర్పింది. అసలు ఈ రోజు దేశంలో ఎలాంటి ఉత్పత్తి సంబంధాలు ఉండాలి? మనుషులు ఎలా బతకాలి అనేది నేర్పింది. ఇన్నింటినిచ్చిన మా గోదావరి ఏం ఆశించింది? ఏమీ ఆశించలేదు. తాగ్యం నేర్పింది. జల్... జంగల్... జమీన్ అనే నినాదమైంది మాకు. మా గుండెల్లో పరుగులెత్తుతున్న గోదావరి అదే! సంభాషణ: సరస్వతి రమ గోదావరి తీరాన... పలుకుబడులు... వ్యవహారాలు! గోదావరి ప్రాంతంలోని సామెతలకు ఎంతో జనాదరణ ఉంది. గ్రామీణ జనం ఎక్కువగా వీటిని వాడుతుంటారు. ఇక్కడి జన వ్యవహారంలో, వ్యావహారిక భాషలో కలిసిపోయిన అనేక సామెతలలో కొన్ని. ఏదారంటే... గోదారన్నట్లు అంబటేరు వచ్చింది అత్తా అంటే... కొలబుర్ర నా చేతిలో ఉంది కోడలా... అన్నదట లంక మేత... గోదారి ఈత కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లు చొల్లంగి తీర్థానికి చోడిగింజలు బల్లకట్టు దాటాక బోడిమల్లయ్య అన్నట్లు ఏట్లో వేసినా ఎంచి వేయాలన్నట్లు పుస్తెల తాడు అమ్మి అయినా పులసలు తినాల్సిందే కొత్తనీటికి చేపలెదురెక్కినట్లు కాకినాడ కాజా, ఆత్రేయపురం తాండ్ర మజా పుణ్యానికని గోదారి స్నానానికెళితే మొసలి ఎత్తుకెళ్లిందట గోదాట్లో నీరెంత ఉన్నా కడవైతే కడివెడే, గరిటైతే గరిటెడే... ఏతాం పాటకు ఎదురు పాట లేదన్నట్లు ఏదారీ లేకపోతే గోదారే... గోదారమ్మొచ్చి గోరంత దీపం పెట్టిందన్నమాట... గోదారెండితే, రైతుల కడుపుమండినట్లేమరి... గోదారి నిమ్మనంగా... జనం చల్లంగా... గోదారి తల్లి పక్కనే ఉంటే ఉక్కపోతా తక్కువే...