-
బొంపల్లి అంగన్ వాడీ పోస్టు భర్తీకి మోక్షమెన్నడో?
దోమ: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు ఆయాలను ప్రభుత్వం నియమించింది. కానీ ఏళ్ల తరబడి కొన్ని సెంటర్లలో టీచర్లు, ఆయాలు లేని కారణంగా లబ్ధిదారులకు సక్రమంగా పౌష్టికాహారం అందడం లేదు. ఇటీవల ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసినప్పటికీ రాజకీయ నేతల ఒత్తిడితో అధికారులు వాటిని భర్తీ చేయలేకపోయారు. నోటిఫికేషన్ వచ్చినా.. దోమ మండలంలో 42 అంగన్వాడీ కేంద్రాలు, 21 మినీ అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో బొంపల్లి అంగన్వాడీలో టీచర్ పోస్టుతో పాటు దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లిలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం అంగన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయినా బొంపల్లి టీచర్ పోస్టుతో పాటు దిర్సంపల్లి, బ్రాహ్మణపల్లి ఆయాల పోస్టును భర్తీ చేయడంలో అధికారులు విఫలం అయ్యారు. బొంపల్లిలో ఏళ్ల తరబడి టీచర్ పోస్టు ఖాళీగా ఉండడంతో బాస్పల్లి సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచరే ఇక్కడ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రాజకీయ ఒత్తిడే కారణం? బొంపల్లి అంగన్ వాడీ టీచర్ పోస్టు భర్తీ విషయంలో రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య అంతర్గత వార్ వలనే పోస్టు భర్తీ కావడం లేదని చర్చ జరుగుతోంది. తమకు సంబంధించిన వ్యక్తికే పోస్టు కావాలంటూ ఇద్దరు నేతలు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. దీంతో సంబంధిత అధికారులు ఇద్దరు నేతలకు సంబంధించిన అభ్యర్థులు అర్హులు కాగా.. పోస్టు భర్తీని నిలుపుదల చేయాలంటూ జిల్లా అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల మనుగడ కొసం అంగన్వాడీ పోస్టు భర్తీ కాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ వేస్తాం బొంపల్లి అంగన్వాడీ కేంద్రంలో ప్రస్తుతం ఇన్చార్జి టీచర్ కొనసాగుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో వేసిన నోటిఫికేషన్కు ఇద్దరు అభ్యర్థులు సెలక్ట్ కాగా.. నేతల జోక్యంతో అది ఆగిపోయింది. టీచర్ పోస్టు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వేస్తాం. – ప్రియదర్శిని, సీడీపీఓ, పరిగి -
ఆరోగ్య ఆసరా కింద రూ. 5 వేలు సాయం
సాక్షి, తాడేపల్లి : భవిష్యత్తులో అంగన్వాడీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల్లో నాడు-నేడు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం..ప్రసవం అయిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద ఐదువేల రూపాయలు అందించాలని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. (కోల్డ్ స్టోరేజీ, గోడౌన్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష) గర్భవతులు, బాలింతలు సహా 36 నెలలోపున్న శిశువులను ఒక విధంగా, 36 నుంచి 72నెలల వరకున్న చిన్నారులను మరో విధంగా చూడాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలోని పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, సహా ప్రత్యేక పుస్తకాలను అందించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్వాడీల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే నాణ్యత ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ -2లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , దీనిపై సమగ్రంగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. సిలబస్పైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. (కరోనా రోగులు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లాలి) -
అంగన్వాడీ ఉద్యమంపై ఉక్కుపాదం
ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు రైల్వే స్టేషన్, బస్టాండ్ వద్ద కొనసాగిన నిర్బంధకాండ చలో అసెంబ్లీ ఆందోళన భగ్నానికి పోలీసుల యత్నం అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై ప్రభుత్వ ప్రతాపం సాక్షి, విజయవాడ బ్యూరో: అంగన్వాడీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తన ప్రతాపం చూపించింది. తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటం చేసినా పట్టించుకోకపోవడంతో అంగన్వాడీలు ఈ నెల 17న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా భయానక పరిస్థితులు సృష్టించారు. సోమవారం తెల్లవారుజామునుంచే పలు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను హౌస్ అరెస్టులు చేశారు. పలు చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు చేసి ఇంటికి తిరిగివెళుతున్న వారినీ ముందస్తు అరెస్టులు చేశారు. కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లబోమని రాతపూర్వక అంగీకార పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. పలు జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల నుంచి హైదరాబాద్కు పయనమైన అంగన్వాడీ కార్యకర్తలను, సీఐటీయూ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగితే మహిళలని కూడా చూడకుండా చంద్రబాబు సర్కారు నిర్బంధకాండ కొనసాగించడంపై పలు జిల్లాల్లో ఉద్యమాలు సాగాయి. పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సీఐటీయూ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 5.30గంటల నుంచే అంగన్వాడీ కార్యకర్తల అరెస్టులు కొనసాగాయి. విజయనగరం జిల్లాలో 547 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా 700 మందికిపైగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను పోలీసులు అరెస్టులు చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా వారి నుంచి పోలీసులు నిర్బంధంగా అంగీకార పత్రాలను తీసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోను ముందస్తు అరెస్టులు కొనసాగాయి. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బయలుదేరిన 20 మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పలుచోట్ల అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను సోమవారం పోలీస్స్టేషన్కు తరలించి మంగళవారం ఉదయం వదిలేందుకు పోలీసులు సన్నాహాలు చేశారు. వైఎస్సార్ జిల్లాలో శని, ఆదివారాల్లో పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. అనంతపురంలో అదే పరిస్థితి నెలకొంది. చలో అసెంబ్లీ జరిపి తీరుతాం.. ప్రభుత్వ నిర్బంధకాండను కొనసాగించి ఉద్యమాలను ఆపలేదని, అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను సాధించేందుకు చలో అసెంబ్లీని జరిపి తీరుతామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బేబీరాణి, పి.రోజా అన్నారు. సోమవారం రాత్రి వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ అంగన్వాడీలకు మద్దతుగా సాగుతున్న శాంతియుత ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 55 వేలకు పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న లక్షా 3 వేల మంది వర్కర్ల న్యాయమైన డిమాండ్స్ను సాధించుకునే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచితే ఏపీ ప్రభుత్వం మాత్రం నిర్బంధకాండను కొనసాగిస్తోందని మండిపడ్డారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే క్రిమినల్ కేసులా?: నారాయణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మలు తగలబెడితేనే ప్రజలు, ఉద్యమకారులపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు.. ఏకంగా మిమ్మల్నే తగలబెడితే ఏం చేస్తారని సీపీఐ నేత కె. నారాయణ ఘాటుగా ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడి ఏపీ హక్కులు సాధించే సత్తా సీఎం చంద్రబాబుకు లేదన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీలు హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్లో నిరవధిక దీక్షలు సోమవారం ప్రారంభించారు. దీక్ష చేపట్టిన వారికి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు బీవీ రాఘవులు, నారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రామిక, కార్మిక వర్గంపై శతృత్వం వహిస్తే, ఆ వర్గాలు సైతం మిమ్మల్ని శతృవులుగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఎం నాయకుడు రాఘవులు మాట్లాడుతూ.. సోదర రాష్ట్రమైన తెలంగాణతో సమానంగా అంగన్వాడీల వేతనాలు పెంచాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు నిరంకుశత్వంగా వ్యవహరిస్తే.. ప్రజా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. మాజీ మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ.. అంగన్వాడీలు లేకుంటే వారి భర్తలను అరెస్టు చేయడం లాంటి పరిస్థితులు ఆఫ్రికా దేశాల్లో కూడా ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. ప్రసాద్, ఆర్ఎస్పీ నాయకులు జానకీరాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలను పోలీసులు సోమవారం రాత్రి భగ్నం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి, ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, ఏఐటీయూసీ నాయకులు రామారావు, హరికృష్ణలతో పాటు ఎనిమిది మందిని పోలీసులు విచక్షణా రహితంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకులు కొంతమంది సొమ్మసిల్లి పోయారు. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ ఏపీ అంగన్వాడీల చలో అసెంబ్లీకి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారంతా ఎక్కడ?
ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
ఆ కంఫర్ట్ కోసమే నిర్మాతగా మారా: దర్శకుడు
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
Viveka Case: అవినాష్రెడ్డికి ఊరట
ఇంత బాగా నేర్చుకుంటానని అనుకోలేదు
పేదల కలను జగన్ మామ నిజం చేశారు
చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్ చదువు
తప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement