-
సంక్రాంతి బరిలో ఏడో సినిమా.. వర్కౌట్ అయ్యే పనేనా?
మొన్నీమధ్యే సంక్రాంతి వెళ్లింది. నాలుగు సినిమాలొస్తే అందులో 'హనుమాన్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, విజేతగా నిలిచింది. అలానే వచ్చే ఏడాది పండక్కి ఇంకా చాలా టైముంది. కానీ ఇంతలోనే బాక్సాఫీస్ బరిలో అర డజనుకు పైగా చిత్రాలు కర్చీఫ్ వేసేస్తున్నాయి. తెలుగు హీరోలని పక్కనబెడితే తాజాగా తమిళ స్టార్ హీరోతో భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ సంస్థ పోటీలో పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్గా మారింది. సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మాములుగా ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీగా ఉంటారు. 2025 పండగ బరిలో చిరంజీవి 'విశ్వంభర' ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. బయటకు చెప్పనప్పటికీ.. ప్రభాస్ 'రాజా సాబ్', బాలకృష్ణ-బాబీ మూవీ, వెంకటేశ్-అనిల్ రావిపూడి సినిమా, నాగార్జున బంగార్రాజు ఫ్రాంచైజీ మూవీ, శతమానం భవతి సీక్వెల్ చిత్రాలు కూడా పండకే రావాలని గట్టిగా ఫిక్సయ్యాయి. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) ఇప్పుడు వీటికి పోటీగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, తమిళ స్టార్ హీరో అజిత్ కాంబోలో తీయబోయే చిత్రం కూడా సంక్రాంతికే రానుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైటిల్ ఫిక్స్ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. తమిళంలో ఈ సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తెలుగులోకి వచ్చేసరికి చిరుతో పోటీపడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సంఖ్య బట్టి చూస్తే దాదాపు ఏడు సినిమాల వరకు సంక్రాంతి బరిలో ఉన్నాయి. చివరకొచ్చేసరికి వీటిలో ఎన్ని నిలబడతాయ్? ఎన్ని తప్పుకొంటాయనేది చూడాలి? మరోవైపు అజిత్కి తెలుగులో ఫ్యాన్ బేస్ తక్కువే. దీంతో మైత్రీ-అజిత్ కాంబో తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందా అనేది సస్పెన్స్. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) With Wholesome Humbleness herewith, we Announce the title of AK's Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO — Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024 -
ప్రభు కూతురు పెళ్లి.. కట్నంగా ఎంత ఇచ్చారంటే
సౌత్ ఇండియాలో స్టార్ నటుడిగా ప్రభుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. కోలీవుడ్ యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో ఆమె వివాహం జరిగింది. ఆమెకు గతంలోనే పెళ్లి కావడం ఆపై భర్త నుంచి విడాకులు తీసుకుంది. సుమారు కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ను రెండో పెళ్లి చేసుకుంది. 2015లో త్రిష ఇల్లానా నయనతార సినిమాతో తమిళ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయిన అధిక్ రవిచంద్రన్.. రీసెంట్గా మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. విశాల్, ఎస్జే సూర్య నటించిన ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టింది. వివాహం కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సమయంలో నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ వివాహానికి నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం, సుహాసిని, దుల్కర్ సల్మాన్, లెజెండ్ శరవణన్, సుందర్.సి, ఖుష్బూ హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. విడాకులు నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యకు గతంలోనే వివాహం అయింది. ప్రభు సోదరి తేన్మొళి కుమారుడు కునాల్తో ఆమెకు వివాహం జరిగింది. కునాల్ లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా, కూతురు ఐశ్వర్య కూడా లండన్లో స్థిరపడింది. అయితే హఠాత్తుగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకుని చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. దర్శకుడితో ప్రేమ విడాకుల తర్వాత చెన్నైకి తిరిగి వచ్చిన ప్రభు కూతురు ఐశ్వర్య కేక్లు తయారు చేసి విక్రయించే వ్యాపారం చేస్తోంది. ఆమె మెల్ట్జ్ డెసర్ట్స్ (meltz.dessertz) అనే కంపెనీని నడుపుతుంది. ఈ సమయంలో, ఐశ్వర్య, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ల స్నేహం ప్రేమగా మారడం. ఆపై ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. కోట్లాది రూపాయల కట్నం వివాహంతో శివాజీ గణేశన్ (ప్రభు తండ్రి) కుటుంబానికి చెందిన దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్కు నగలు, చెన్నైలో విలాసవంతమైన బంగ్లాతో పాటు నగదు రూపంలో కోటి రూపాయలు కట్నం ఇచ్చినట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐశ్వర్య వయసు 34 ఏళ్లు కాగా, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు. -
ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)
-
ప్రభు కూతురిని పెళ్లాడిన ప్రముఖ డైరెక్టర్, ఫోటో వైరల్
ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ పెళ్లిపీటలెక్కాడు. సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యను పెళ్లాడాడు. చెన్నైలో శుక్రవారం (డిసెంబర్ 15న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'డార్లింగ్ అధిక్, నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా చెల్లిని మహారాణిలా చూసుకోవాలి జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభు సర్, పునీత ఆంటీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. నా చెల్లిని పెళ్లి చేసుకున్న అధిక్.. నువ్వు తనను మహారాణిలా చూసుకోవాలి. అర్థమైందా? సరదాగా అన్నానులే.. నువ్వు తనను బాగా చూసుకుంటావని నాకు తెలుసు. అదేంటో కానీ నా సోదరీమణులందరూ ఐశ్వర్య అనే పేరుతోనే కనిపిస్తారు. మీ జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఐశ్వర్యకు రెండో పెళ్లి.. కాగా ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో బంధువైన కునాల్తో ఆమె పెళ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. కానీ కొంతకాలానికి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు విడాకులిచ్చేసి కొంతకాలంగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విషయానికి వస్తే ఇతడు 'త్రిష ఇల్లన నయనతార' సినిమాతో దర్శకరచయితగా సినీ కెరీర్ ఆరంభించాడు. 'దబాంగ్ 3' అనే బాలీవుడ్ సినిమాకు రచయితగానూ పని చేశాడు. ఇటీవల 'మార్క్ ఆంటోని' సినిమాతో కోలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ డైరెక్టర్ 'కే-13', 'నేర్కొండ పార్వై', 'కోబ్రా' సినిమాల్లో అతిథి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అజిత్తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్! So damn happy for u my darling Adhik and my dearest sister Aishwarya on your wedding today and starting a new chapter in your lives and u hav the universe s blessings and especially your parents prabhu sir and punitha aunty's positivity and blessings now. Coming to the point,… pic.twitter.com/Vucqwch3J0 — Vishal (@VishalKOfficial) December 15, 2023 చదవండి: మహారాణిలా బతకాలనుకున్నా.. 18 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి, పిల్లలు, విడాకులు.. ప్రముఖ డైరెక్టర్తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు) -
కోలీవుడ్ స్టార్ హీరో మూవీ.. నిర్మించనున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్బైజాన్లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement