breaking news
ademma dibba site
-
కబ్జా కోసం కంచె
ఆదెమ్మదిబ్బలో అక్రమార్కుల బరితెగింపు అడ్డుకున్న బ్రాహ్మణ మహిళలు ఆధారాలు చూపాలని గద్దించడంతో వెనుదిరిగిన వైనం స్థల యజమానిదినకరప్రసాద్పై కోర్టులో కేసు సాక్షి, రాజమహేంద్రవరం : రూ. వంద కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మదిబ్బను ఆక్రమించేందుకు కబ్జాదారులు బరితెగిస్తున్నారు. తాజాగా అక్కడ ఉన్న 10 కుటుంబాల పేద బ్రాహ్మణుల ఇళ్లను కలుపుతూ కంచె వేయడానికి యత్నించి మహిళలు ప్రతిఘటించడంతో జారుకున్నారు. 50 ఏళ్లుగా ఉంటున్నామని, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఏమిటో చూపాలని నిలదీయడంతో వాళ్లు సద్దుకోవాల్సి వచ్చింది. ఈ స్థలం సత్యవోలు పాపారావు తమ్ముడు లింగమూర్తిదని, ఆయన తండ్రి, తమ తాతకు ఈ స్థలం ఇస్తామని చెప్పాడని, చెరువును పూడ్చి పూరిగుడిసె నుంచి ఇప్పడు రేకుల షెడ్డుకు తమ నివాసాన్ని మార్చుకున్నామన్నారు. లింగమూర్తి పెద్దకుమారుడు లక్షీ్మపతి ఇంట్లో తాము పని చేశామని, ఆయన కూడా ఈ స్థలం తమకు రిజిస్ట్రేష¯ŒS చేయిస్తానని మాట ఇచ్చారన్నారు. తమ 10 కుటుంబాలు ఉన్న స్థలాన్ని మా పేర్ల రిజిస్ట్రేష¯ŒS చేసేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోమని చెప్పారని, అయితే 2005లో ఆయన చనిపోయాకా తాము లక్షి్మపతి తమ్ముడు సత్యవోలు దినకర ప్రసాద్ వద్దకు వెళ్లగా ఆయన తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. దీంతో తామందరం 2007లో ఆయనపై కోర్టుకు వెళ్లామని చెప్పారు. ఈ కేసు రాజమహేంద్రవరం జూనియర్ సివిల్ జడ్డి వద్ద నడుస్తోందని తెలిపారు. ఐఏ నం. 1502/2016, ఓఎస్ నం. 685/2007 అని తెలిపారు. తాజాగా ఎవరో వచ్చి ఈ స్థలం తాము సత్యవోలు శేషగిరిరావు వద్ద డెవలప్మెంట్కు తీసుకున్నామని చెబుతూ ఖాళీ చేయాలని వచ్చారని, స్థలం డాక్యుమెంట్లు అడిగితే ఎదురు ప్రశ్నిస్తున్నారని దుగ్గిరాల శ్రీదేవి అనే మహిళ పేర్కొన్నారు. అయితే కోర్టు కేసులు పూర్తయిన తర్వాత తమకు ఏదో ఒక న్యాయం చేస్తానని దినకర ప్రసాద్ చెప్పారని ఆమె తెలిపారు. కబ్జాదారుల బరితెగింపు ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉత్తరంవైపు 38వ డివిజ¯ŒSలో ఉన్న పేదలను భయభ్రాంతులకు గురిచేసిన ఆక్రమణదారులు వారికి నగదు ఇచ్చి ఖాళీ చేయించారు. పక్కనే వాంబే ఇళ్లలో ఉన్నవారు, ఐదు పదేళ్ల నుంచి అక్కడ గుడిసెలు వేసుకున్న వారు ఆ నగదు తీసుకుని వెళ్లిపోయారు. కానీ 50 ఏళ్ల నుంచి ఉంటున్నవారు మాత్రం తాము ఖాళీ చేసేది లేదని, సత్యవోలు పాపారావు తమకు తెలుసని, వారి కుమారులు వస్తే వారితో మాట్లాడుకుంటామని చెప్పి అక్కడే ఉండిపోయారు. దీంతో ఖాళీ చేయబోమని చెప్పిన పేదల గుడిసెలను కలుపుతూ వారిళ్లకు వెళ్లేందుకు దారిలేకుండా ముళ్ల కంచె వేశారు. ఎలాంటి ఆధారం లేని వారు ఇంట్లోకి వెళ్లి రావడానికి నానా కష్టాలు పడుతున్నారు. అదే స్థలంలో ఉన్న చర్చిని కలుపుతూ కూడా ముళ్ల కంచె వేశారు. తాజాగా దక్షిణం వైపు 36వ డివిజ¯ŒSలోని పేద బ్రాహ్మణుల ఇళ్లను కలుపుతూ కంచె వేయడానికి ప్రయత్నించగా మహిళలు ప్రతిఘటించడంతో కబ్జాదారులు వెనక్కు తగ్గారు. -
కొన్నది లేదు.. అమ్మిందీ లేదు..!
ఆదెమ్మదిబ్బ స్థలంలో భూ బకాసురుల లీల! రూ.100 కోట్ల స్థలం కబ్జా చేసినా పట్టించుకోని వైనం పత్రాలు చూపించకపోయినా అధికారుల ప్రేక్షకపాత్ర రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున రూ.100 కోట్ల స్థలం యథేచ్ఛగా ఆక్రమించారు భూ బకాసురులు. నగదు ఇచ్చి పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. ఇదేమిటని అడిగిన అధికారులకు, నాయకులకు ‘నేను ఈ స్థలం కొన్నాను’ అని చెబుతున్నారు. ఎప్పుడు కొన్నారు? ఎంత స్థలం కొన్నారు? ఆ డాక్యుమెంట్లు చూపించాలని అధికారులు, వివిధ పార్టీల ద్వితియ శ్రేణి నేతలు అడిగితే.. ‘సాయంత్రం తెస్తాను.. రేపు తెచ్చి చూపిస్తా’నంటూ స్థలం కొనట్టు చెబుతున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు చెబుతున్నారు. దాంతో అధికారులు, పార్టీల నేతలు వెళ్లిపోతున్నారు. 50 ఏళ్ల నుంచి ఉంటున్న పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, స్థలం కొనుగోలు చేసి ఉంటే ఈ పక్కకు రాబోమని నేతలు అంటున్నారు. ఇదీ ఇప్పటి వరకు జరిగిన రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మ దిబ్బ స్థలం వ్యవహారం. – సాక్షి, రాజమహేంద్రవరం డాక్యుమెంట్లు ఏవీ? నగరంలోని 36, 38 డివిజన్ల మధ్య ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న 110 మంది పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. 13వ తేదీన అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య తన సిబ్బందితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. గుడిసెలు తొలగింపజేస్తున్న కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. తాను 4 వేల గజాలు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని ఈశ్వరుడు తహసీల్దార్కు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని తహసీల్దార్ కోరగా, ఈశ్వరుడు ఇక్కడ లేవని చెప్పారు. అయితే సాయంత్రం కార్యాలయానికి తీసుకువచ్చి చూపించాలని తహసీల్దార్ ఆదేశించారు. ఇందుకు సమ్మతించిన ఈశ్వరుడు ఆ రోజు సాయంత్రం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదు. సరే మరుసటి రోజు తెస్తారని ఎదురుచూసిన తహసీల్దార్కు సమయం వృథా అయ్యిందే తప్ప డాక్యుమెంట్లు రాలేదు. ఒకటి కాదు, రెండు కాదు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ స్థలం కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు తహసీల్దార్కు చేరలేదు. యథేచ్ఛగా ఇళ్ల తొలగింపు డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడంతో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు వెళ్లిపోయారు. డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న పేదల గుడిసెలు, రేకుల షెడ్లను ఆక్రమణదారులు యథేచ్ఛగా తొలగిస్తున్నారు. పేదలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారు. ఖాళీ చేయబోమని చెబుతున్న వారి ఇళ్లను కూడా కలిపి చుట్టూ ముళ్ల కంచె వేశారు. రాకపోకలకు వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సొంత వాంబే ఇళ్లు ఉన్నవారు చెప్పిందే తడవుగా ఇచ్చింది తీసుకుని ఖాళీ చేశారు. ఇళ్లు లేని పేదలు వారు ఖాళీ చేశారు కదా, పెద్దలతో వివాదం ఎందుకని వెళ్లిపోయారు. ఇక అక్కడ 10 రేకుల షెడ్లు ఉన్నాయి. అవి పేద బ్రాహ్మణలకు చెందినవి. ఖాళీ చేయాలని వారికి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఓపక్క ఇళ్లు తొలగిస్తుండడంతో, 50 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని పేరు చెప్పడానికి భయపడుతున్న బ్రాహ్మణ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల నేతలకూ టోకరా.. ఎన్నో ఏళ్ల నుంచి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారని తెలుసుకున్న సీపీఎం నేతలు ఈ నెల 13న, బీజేపీ అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, గరిమెళ్ల చిట్టిబాబు తదితరులు ఈ నెల 15న ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మురుసటి రోజు నగరపాలక సంస్థ వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మసా రామజోగి, జిల్లా కార్యవర్గ సభ్యుడు లంక సత్యనారాయణ తదితరులు స్థలాన్ని పరిశీలించి, పేదలు, పిన్నమరెడ్డి ఈశ్వరుడితో మాట్లాడారు. అప్పుడు కూడా ఈశ్వరుడు తాను ఈ స్థలం కొన్నానంటూ వారికి చెప్పారు. ఆ డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా, అధికారులకు చెప్పినట్టే సాయంత్రం తెచ్చి చూపిస్తాననడంతో నేతలు వెనుదిరిగారు. అయితే ఇక్కడకు కూడా అధికారులతో పాటు నేతలకూడా స్థలం కొన్నాననంన్న వ్యక్తి టోకరా వేశారు. డాక్యుమెంట్లు చూపించకపోగా, నేతలు ఫో¯ŒS చేసినా తీయడం మానేశారు. ఐదు రోజులవుతున్నా ఈశ్వరుడు డాక్యుమెంట్లు చూపించకపోవడం గమనార్హం. ప్రశ్నలు అనేకం.. సమాధానాలు? స్థలం కొన్నానని చెబుతూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న పేదలను ఖాళీ చేయిస్తున్నారు. డాక్యుమెంట్లు ఇప్పటి వరకూ చూపించకున్నా.. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఎందుకు మిన్నుకుండిపోయారు? ఆ స్థల యజమానులు ఎవరు? ఎన్నో ఏళ్లుగా పేదలుంటున్నా వారిని ఎందుకు ఖాళీ చేయించలేదు? ఇన్ని రోజులు అమ్మని స్థలాన్ని ఇప్పడెందుకు విక్రయించారు? అసలు ఎవరికి అమ్మారు? సర్వే నంబర్ ఎంత? ఎంత స్థలం కొన్నారు? ఏ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేష¯ŒS జరిగింది? సాక్షులు ఎవరు? పెద్దనోట్ల రద్దు, నగదు విత్డ్రాపై ఆంక్షలున్న సమయంలో అంత డబ్బు కొనుగోలుదారులకు ఎక్కడ నుంచి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం నగర ప్రజలను తొలిచేస్తున్నాయి.