breaking news
Abhilash Tommy
-
ఒడ్డుకు చేరిన సముద్రంలో చిక్కుకున్న నావికుడు
-
అభిలాష్ను కాపాడారు
న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోబ్ రేస్లో భాగంగా ఒంటరిగా ప్రపంచ యానం చేస్తూ హిందూమహా సముద్రంలో ప్రమాదానికి గురైన కేరళకు చెందిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ(39)ను విజయవంతంగా రక్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆయన్ను రక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం అభిలాష్ పడవ ‘తురయా’ వద్దకు చేరుకున్న ఫ్రెంచి మత్స్యకార పడవ ‘ఒసిరిస్’ సిబ్బంది ఆయన్ను రక్షించింది. ఈ విషయం తెలిసి తాము టెన్షన్ నుంచి బయటపడ్డామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఒసిరిస్లో దగ్గర్లోని ఇల్ ఆమ్స్టర్డాం దీవికి, అక్కడి నుంచి ‘ఐఎన్ఎస్ సాత్పురా’లో మారిషస్ తీసుకువచ్చి, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తాం’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. -
నావికా దళాధికారి ఆచూకీ లభ్యం
పారిస్/కోచి: తీవ్రంగా గాయపడి హిందూమహా సముద్రంలో గల్లంతైన భారతీయ అధికారి ఆచూకీ దొరికిందని ఫ్రాన్స్కు చెందిన గోల్డెన్గ్లోబ్ రేస్ సంస్థ ప్రకటించింది. భారత నావికాదళ కమాండర్ అభిలాష్ టామీ(39) తురయా అనే తన పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక నావికుడు. ఫ్రాన్స్ తీరం నుంచి జూలై 1వ తేదీన 18 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రేసులో ఇప్పటివరకు 10,500 నాటికల్ మైళ్లు ప్రయాణించారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న అభిలాష్ హిందూమహా సముద్రంలో ఆస్ట్రేలియాలోని పెర్త్కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా తీవ్ర తుపానులో చిక్కుకున్నారు. అలల తాకిడికి ఆయన పడవ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడి, నిస్సహాయ స్థితిలో ఉన్న అభిలాష్ శనివారం రేస్ నిర్వాహకులకు మెసేజ్ పంపారు. రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురాను ఆ ప్రాంతానికి పంపించినట్లు భారత నావికా దళం తెలిపింది. -
సాహసవీరుడు.. సాగర యాత్ర
ఊరి పొలిమేర వరకూ వెళ్లాలంటేనే ఒకరిని వెంటరమ్మంటాం. అదే లాంగ్ ట్రిప్ అయితే.. దోస్తుల మందను వెంటేసుకుపోతాం. అలాంటిది ఒంటరిగా సముద్రయానం అంటే ఎలా ఉంటుంది.అదీ ఒక్క రోజో.. రెండు రోజులో కాదు.. ఏకంగా 151 రోజులు. నాన్స్టాప్ జర్నీ. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకంటే కష్టమైన అడ్వెంచర్ ఇంకేదీ ఉండదనిపిస్తుంది. కడలి కెరటాలపై సాగిన ఆ యువకుడి జర్నీ... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఐదువేల మందికి పైగానే ఉన్నారు. అంతరిక్ష యాత్ర చేసిన వారు 500 మంది వరకూ ఉంటారు. కడలి కెరటాలపై నాన్స్టాప్గా భూగోళాన్ని చుట్టొచ్చింది మాత్రం 80 మందే. ఇలాంటి క్లిష్టమైన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి భారతీయుడు, సెకండ్ ఏషియన్.. నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అభిలాష్ టామీ. ప్రభుత్వం ఆయనను కీర్తి చక్ర అవార్డుతో గౌరవించింది. ఇటీవల నగరానికి వచ్చిన అభిలాష్ని ‘సిటీప్లస్’ పలకరించింది.. మా నాన్న నేవీలో పని చేసేవారు. అందుకే చిన్నప్పటి నుంచి నేవీ అంటే ఇష్టం. సముద్ర ప్రయాణాలంటే ఆసక్తి ఉండేది. ఎప్పుడూ సముద్రానికి దగ్గరగా ఉండాలని కోరుకునేవాణ్ని. అందుకే నేవీలో చేరాను. సముద్ర జలాలపై తేలి ఆడుతూ సాగే సెయిలింగ్ గేమ్ అంటే భలే సరదా. సెయిలింగ్ గేమ్కు సంబంధించిన పుస్తకాలు చదివేవాణ్ని. నేవీ కాంపిటీషన్స్లో చాలాసార్లు పాల్గొన్నాను. అన్ని రకాల బోట్స్ నడిపాను. ఇదే సమయంలో నేవీ అధికారులు నాన్స్టాప్ సర్కమ్ నావిగేషన్ ప్రాజెక్ట్ తలపెట్టారు. బోట్లో నాన్స్టాప్గా గ్లోబ్ చుట్టిరావాలి. అదీ ఒంటరిగా. దీని గురించి అనుకున్నప్పుడు వాళ్లు నన్నే మొదట అడిగారు. నా డ్రీమ్ పూర్తి చేసుకునే అవకాశం రావడంతో వెంటనే సరేనన్నాను. ఆమే స్పూర్తి.. గతంలో సర్కమ్ నావిగేషన్ గురించి ఒక మ్యాగజైన్లో చదివాను. 1999లో ఆ రేస్ టీమ్లో ఈబెల్ అనే ఓ ఫ్రెంచ్ లేడీ ఉన్నారు. ఆమే నాకు స్ఫూర్తి. ఆవిడ చేయగలుగుతున్నప్పుడు నేనెందుకు చేయలేను అని అనిపించింది. నా టూర్కు ముందు మలేసియాలో సెయిలింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. 2012 నవంబర్ 1న ముంబైలో నా సముద్రయానం మొదలైంది. దక్షిణం నుంచి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అంట్లాంటిక్ ఓషన్ అలా 40 వేల కిలోమీటర్లు బోట్లో ప్రయాణించాను. 151 రోజుల ప్రయాణం తర్వాత అంటే 2013 మార్చ్ 31న ముంబై చేరుకున్నాను. లంగరుతో పని లేదోయ్.. పూర్తిగా సముద్రం మీదుగా సాగే ఈ యాత్రలో సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులకూ సిద్ధంగా ఉండాలి. మనకు మనమే అన్నీ కావాల్సి ఉంటుంది. వాతావరణం, వంట, ఐటీ, రూట్ మ్యాప్ ఇలా అన్నీ తెలిసుండాలి. మరో మనిషి సాయం నేరుగా అందే అవకాశం లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా మానసికంగా బలంగా ఉండాలి. కాస్త డీలా పడ్డా.. ప్రయాణం పెద్ద ప్రమాదంగా మారిపోతుంది. ఆలోచనను పక్కదారి పట్టకుండా చూసుకుంటే ఈజీగా ముందుకెళ్తాం. ఈ ప్రయాణం ఒక్కసారి మొదలైతే డెస్టినేషన్ రీచ్ అయ్యే వర కూ లంగరుతో పని ఉండదు. ఆఫ్టర్ 130 డేస్.. 151 రోజుల యాత్రలో.. 130 రోజుల తర్వాత మనిషిని చూడగలిగాను. నా యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి భూమిని చూడటం గొప్ప అనుభూతినిచ్చింది. అట్లాంటిక్ సముద్రంలో తిమింగలాలు వెంటాడాయి. తుఫాన్లంటారా కామన్. మరో 15 రోజుల ప్రయాణం మిగిలి ఉండగా.. బోట్లో మంచినీళ్లు డీజిల్ లీకేజీతో తాగడానికి పనికి రాకుండా పోయాయి. వరుణుడి దయతో ఇన్ని నీళ్లు దొరికాయి. ఇవన్నీ ఒంటరిగా ఎలా హ్యాండిల్ చేశానని ఆలోచిస్తే.. సాహసానికి ఇవన్నీ పరీక్షలే కాని అవరోధాలు కాదనిపిస్తుంటుంది. ఓ మధు