breaking news
abdul jaleel
-
ఈ–సైకిల్’.. లోకల్ మేడ్
E Bicycle Homemade: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన బైక్ మెకానిక్ అబ్దుల్ జలీల్ ఈ–సైకిల్ తయారు చేశారు. కేవలం రూ.6,200 ఖర్చుతో పాత సైకిల్ను ఈ–సైకిల్గా విజయవంతంగా మార్చారు. 20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటలపై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్లేటర్, మోటార్) అమర్చి ఈ సైకిల్ను తయారు చేశారు. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) ఇది గంటన్నర చార్జింగ్తో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని జలీల్ తెలిపారు. ముందుగా ఈ ప్రయోగం పాత సైకిల్తో చేసినట్లు తెలిపారు. రూ.21 వేలతో నూతన సైకిల్తోపాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్ను త్వరలో తయారు చేస్తానని చెప్పారు. మధ్య వయసున్న పేద, మధ్యతరగతి వారు ఈ సైకిల్ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
ప్రధాని మోదీపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
పట్నా: బిహార్ మంత్రి అబ్దుల్ జలీల్.. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో దుమారం రేపాయి. ప్రధాని మోదీ దోపిడీ దొంగంటూ జలీల్ విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. బుధవారం బిహార్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టిముట్టి జలీల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. చివరకు మంత్రి జలీల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. జలీల్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. జలీల్ను కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.