
రెండు చేతులూ లేకపోయినా విలువిద్యలో రాణిస్తున్న కశ్మీరీ ఆణిముత్యం శీతల్ దేవి

పారిస్ పారాలింపిక్స్లో పతకం సాధించిన శీతల్

ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి రాకేశ్ కుమార్తో కలిసి కాంస్యం సొంతం చేసుకుంది

పదిహేడేళ్ల వయసులోనే పారాలింపిక్స్ పతకాన్ని మెడలో వేసుకున్న శీతల్

చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి యువ తరానికి శీతల్ దేవి జీవితం ఆదర్శప్రాయం

కశ్మీర్లోని దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి శీతల్

స్వస్థలం కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం.

శీతల్ తండ్రి మాన్ సింగ్ రైతు, తల్లి శక్తిదేవి

శక్తిదేవి గొర్రెలను సాకుతూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడుగా ఉంటుంది

ఈ జంటకు కలిగిన మొదటి సంతానమే శీతల్.

శీతల్కు పుట్టుకతోనే చేతులు(ఇలాంటి స్థితిని ‘ఫొకొమెలియా’ అంటారు) ఏర్పడలేదు.

అయినప్పటికీ శీతల్ తల్లిదండ్రులు కుంగిపోలేదు

చిన్ననాటి నుంచే ఆత్మవిశ్వాసం పొంపొందేలా ఆమెలో ధైర్యం నూరిపోశారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో శీతల్ శారీరక వైకల్యాన్ని అధిగమించింది

చేతులలేని లోటును కాళ్లతో పూడ్చడానికి ప్రయత్నించి సఫలమైంది

రెండు చేతులూ లేకపోయినా శీతల్ చెట్లు ఎక్కి ఆడుకునేది

స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్ రాసుకోవడం, ఫోన్ను ఉపయోగించడం నేర్చుకుంది.

బీయింగ్ యుతో పరిచయం శీతల్ జీవిత గమనాన్నే మార్చివేసింది.

కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటర్నెట్లో దివ్యాంగులకు సాయం చేసే సంస్థ– బీయింగ్ యు గురించి ఆమెకు తెలిసింది.

ఆ సంస్థకు చెందిన ప్రీతి రాయ్.. శీతల్లోని క్రీడాకారిణిని గుర్తించింది.

దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి, తన సంస్థ స్పాన్సర్షిప్ కింద కశ్మీర్లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రానికి పంపింది.

ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్ విలువిద్య సాధన మొదలెట్టింది. 2023 అక్టోబర్ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

పారా ఏసియన్ చాంపియన్గా నిలిచిన శీతల్ ఖాతాలో ఇప్పుడు ఏకంగా పారాలింపిక్స్ పతకం చేరింది.

వైకల్యాన్ని జయించాలన్న ఆమె ఆత్మవిశ్వాసం ముందు విధి కూడా చిన్నబోయింది.

