చేపల మార్కెట్లపై మృగశిర కార్తె ప్రభావం కనిపించింది. హైదరాబాద్ నగరంలోనే ప్రసిద్ధి గాంచిన ముషీరాబాద్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది.
సోమవారం మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం కూడా తోడవ్వడంతో చేపల ప్రియులు మార్కెట్కు భారీగా తరలి రావడంతో రద్దీ నెలకొంది.
చేపలను కొనేందుకు హైదరాబాద్ నగర వాసులు మార్కెట్లకు పోటెత్తారు.


