
కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయ ఐదో వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వేదపండితుడు చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్లు, శివసత్తులు పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు

తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు

జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, కిరణ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఎస్సై భాస్కరాచారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు












