నరసాపురంలో జిల్లా విజయోత్సవ అభినందన సభ

District Triumphal Appreciation Meeting in Narsapuram - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి :  ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, అందుకే తెలివిగా వ్యవహరించి వై ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్‌ రాజు పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో నరసాపురంలో జిల్లా విజయోత్సవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా, ప్రజలకు నిజాయితీతో కూడిన పాలన అందించాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రఘురామకృష్ణంరాజు, కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొన్నారు. 

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top