ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు వరు సగా గెలుపొందిన ఓటమి ఎరుగని ప్రజానాయకుడు ఆయన. కుల మతాలను, గ్రూపులను ఆకట్టుకొనే రాజకీ యాలకు ఆయన ఆమడ దూరం. రాజకీయమంటేనే నాలుగు డబ్బులు.. కాదు కాదు.. రూ.కోట్లు పోగేసుకునే నేటి కాలంలో విలువల కోసం కట్టుబడ్డారు... ఆస్తులు కరిగించుకొన్నారు. కానీ, నిబద్ధతకు ప్రతిరూ పంగా నిలిచారు. అందుకే ఆయన కన్ను మూసిన రోజు పార్టీల కతీతంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఆయన గుదిబండి వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా రాజకీయాల్లో చిరపరిచితుడు. 2004 వరకు కొనసాగిన దుగ్గిరాల నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్ పార్టీదే విజయం. 1985 వరకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే కూడా రెండు పర్యాయాలు గెలుపొందలేదు. ఆ ఒరవడికి గుదిబండి గండికొట్టారు. 1989లో ఆరం భించి వరుసగా నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నిక య్యారు. సీఎంలుగా పనిచేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్. జనార్ధనరెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జిల్లా సీనియర్ నేతలు కే.రోశయ్య, ఆలపాటి ధర్మారావుతో సన్నిహితంగా వ్యవహరించేవారు.
వెంకటరెడ్డి నిర్మొహమాటి. తన మనసుకు మంచి అనిపించింది ఎవరి ఎదుటైనా, ఎక్కడైనా ముక్కుసూటిగా చెప్పటం అలవాటు. సహచర శాసనసభ్యుల్లో అవినీతిపరులున్నా రంటూ సంచలన వ్యాఖ్యలు చేయటానిక్కూడా ఆయన వెనుకాడ లేదు. 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంకటరెడ్డికి, ఒక పర్యాయం మంత్రి పదవి తృటిలో తప్పిపోయింది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా దుగ్గిరాల నియోజకవర్గం రద్దయింది. ఆయన స్వస్థల మైన కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గంలో కలిసింది. ఆ ఎన్నికల్లో పార్టీ టికెట్ ద క్కలేదు.
కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంకోసం పాటుపడుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్ని కలకు మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుకు పనిచేసిన వెంకటరెడ్డికి పల్నాడులోని దైద, తేలుకుట్ల, కరాలపాడు, ముత్యాలం పాడు గ్రామాల్లో పంచెలు, చీరెలు పరిచి నడిపిస్తూ స్వాగతం పలకటం ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వం కల్పించే గన్మ్యాన్ సౌకర్యాన్ని ఏనాడూ అంగీకరించ లేదు. ఎన్నికల్లో ఖర్చుపెట్టడమే కానీ తిరిగీ తీసుకునే అలవాటు ఆయనకు లేదు. రాజకీయ అవలక్షణాలు అంటని ఆయన వ్యక్తిత్వం మాత్రం వెలుగుదివ్వెలా వెలుగులీనుతూ ఉంది.
(గురువారం గుంటూరు జిల్లా కొల్లిపరలో ఆకస్మికంగా కన్నుమూసిన సీనియర్నేత, మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డికి నివాళిగా..)
బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి
- గుదిబండి వెంకటరెడ్డి
మొబైల్: 97059 31082
నీతికి నిలువెత్తు రూపమైన ప్రజానేత
Published Fri, Oct 7 2016 1:26 AM
Related news
-
సీఎంను అందించిన భాగ్యనగరం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని భాగ్యనగరం మూటగట్టుకుంది. రాజకీయ ఉద్దండుడు మర్రి చెన్నారెడ్డి 1989లో సనత్నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సనత్నగర్కు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 17 వరకు సీఎం బాధ్యతలు చేపట్టారు. నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి తనదైన మార్క్ను సాధించారు. సనత్నగర్ నుంచి పోటీ చేయకముందే 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబర్ 11 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న సనత్నగర్ నియోజకవర్గం 1978లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా నాలుగో ఎమ్మెల్యేగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు మర్రి శశిధర్రెడ్డిని నిలబెట్టి 1992లో గెలిపించుకుని తన రాజకీయ వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకుసాగారు. దశాబ్ద కాలం క్రితం వరకు సనత్నగర్ అంటే మర్రి కుటుంబం, మర్రి అంటే సనత్నగర్గా ఉంటూ వచ్చింది. ఇవి చదవండి: TS Election 2023: దోస్త్ వర్సెస్ దోస్త్..! -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్గార్డెన్లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సివిల్ సర్వీస్ స్టడీ శిక్షణ టూర్లో భాగంగా సిద్దిపేట అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి వచ్చిన నాగలాండ్కు చెందిన 12 మంది ప్రతినిధులతో ఎంపీ ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు పెన్షన్లతోపాటు ఆడపిల్లల వివాహనికి కల్యాణలక్ష్మి అందిస్తుందన్నారు. ఉచిత విద్యలో భాగంగా ప్రతీ విద్యార్థిపైన రూ.లక్ష ఖర్చు చేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో వైద్య, విద్యకు పెద్దపీట వేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపామన్నారు. నాగలాండ్ బృందాన్ని హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇరానీ చాయ్ రుచి చూడాలని కోరారు. నాగలాండ్లో జరుగుతున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలను సివిల్ సర్వీస్ శిక్షణ పొందుతున్న ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నాగలాండ్ ప్రతినిధులు గజ్వేల్లో నిర్మించిన ఇంటిగ్రేటేడ్ కార్యాలయంతో పాటు మార్కెట్, కోమటిచెరువు, ఆక్సిజన్ పార్క్ సందర్శించారన్నారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలో ఏక్కడా లేవని పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్లను చూసి ఇవి దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి శిక్షణా కేంద్రం కోఆర్డినేటర్ కందుకూరు ఉషారాణి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెన్నారెడ్డి సేవలు చిరస్మరణీయం
సాక్షి, హైదరాబాద్: ప్రజాహితం కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతించారు. హైటెక్ సిటీ శిల్ప కళావేదికలో ఆదివారం జరిగిన మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మర్రి చేసిన పోరాటాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. చెన్నారెడ్డి సూచించిన దారిలో నడవడమే ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. ‘శాసనసభ లో ఎన్ని విమర్శలు చేసినా హుందాగా స్వీకరించే వారు. మేం అడిగిన ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు చెప్పేవారు. శాసన సభలో తాను, జైపాల్ రెడ్డి ఎన్నో సార్లు ప్రశ్నలు సంధించేవాళ్లం’ అని చెప్పారు. పదవులకే వన్నె తెచ్చారు.. ఆయన చేపట్టిన ప్రతి పదవికి వెన్నె తెచ్చారని వెంకయ్య నాయుడు కొనియాడారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అని, రైతు కుటుంబం వచ్చి.. రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు. నీటి పారుదల రంగం కోసం విస్తృతంగా కృషి చేశారన్నారు. పరిపాలనలో ఉన్న లోటుపాట్లను సరి చేశారన్నారు. భూ సమస్యల పరిష్కారం కొసం కొత్త పద్దతిని అవలంబించారని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. నిరుపేదలకు భూ పంపిణీ చేశారని పేర్కొన్నారు. యువత నక్సలిజం, తీవ్రవాదం వైపు మళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో మర్రి చెన్నారెడ్డి అవలంబించిన విధానాలను ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. వ్యక్తిగత దూషణలు ప్రమాదకరం.. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలు ప్రమాదకరమని.. మన దగ్గర సబ్జెక్టు ఉంటే అరిచి గగ్గోలుపెట్టాల్సిన అవసరం ఉండదని వెంకయ్య నాయుడు అన్నారు. నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినప్పుడే వ్యవస్థను మెరుగుపర్చవచ్చని పేర్కొన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని మరిచిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. సాధించే వరకు నిద్రపోయే వారు కాదు.. భారత రాజకీయ చరిత్రలో చెన్నారెడ్డి రాజకీయ ప్రస్థానం చాలా గొప్పదని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన అనుకున్నది సాధించే వరుకు నిద్రపోయేవారు కాదన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించేవారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత కూడా ఆయన అన్ని ప్రాంతాల వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చారన్నారు. ఎస్సారెస్పీతో తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. ఆయన గొప్ప జాతీయవాది అని, రాజస్థాన్ గవర్నర్గా ఉండి కశ్మీర్ అంశంపై మాట్లాడిన వ్యక్తి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన ఓ మహానుభావుడు.. మర్రి చెన్నారెడ్డి ఎంతంటి గొప్పవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ మహానుభావుడని మాజీ గవర్నర్ కె.రోశయ్య పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టారని, వాటికి వన్నె తెచ్చారని తెలిపారు. అభివృద్ధిపైనే చర్చించే వారు.. మర్రి చెన్నారెడ్డిని ఎప్పుడు కలిసినా అభివృద్ధి గురించే చర్చించేవారని సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేదన్నారు. ఆయన పోరాటం ఎంతో గొప్పది.. పేదల అభివృద్ధికి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నేత ఆర్సీ కుంతియా అన్నారు. ఇందిరాగాంధీతో రాజకీయంగా ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. తెలంగాణ సాధించడం కోసం చెన్నారెడ్డి చేసిన పోరాటం ఎంతో గొప్పదన్నారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఏ బాధ్యత చేపట్టిన దానికి వెన్నె తెచ్చారన్నారు. -
పుస్తక రూపంలో చెన్నారెడ్డి జీవిత చరిత్ర
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని పలువురు రాజకీయ, ప్రముఖ వక్తలు అభిప్రాయపడ్డారు. గొప్ప పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడైన చెన్నారెడ్డిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కులో ఉన్న మర్రి చెన్నారెడ్డి రాక్గార్డెన్లో చెన్నారెడ్డి మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదివారం ఇందిరాపార్కు రాక్గార్డెన్లో చెన్నారెడ్డి శత జయంతి (100) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రతిపక్షాల దాడిని సైతం హుందాగా స్వీకరించే ముఖ్యమంత్రుల్లో స్వర్గీయ చెన్నారెడ్డి ఒకరని కితాబిచ్చారు. చెన్నారెడ్డి జీవితం పట్టువిడుపులా ఉండేదని, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని తెలిపారు. గొప్ప వ్యక్తిత్వం గల బహుముఖ ప్రజ్ఞశాలి చెన్నారెడ్డి అని కొనియాడారు. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ.. చెన్నారెడ్డి కొందరివాడు కాదని, అందరి వాడని, తనతో విభేదించే వారిని కూడా ఆమోదింపజేసుకునే విలక్షణ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ గవర్నర్లు రోశయ్య, రాంమోహన్రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, నంది ఎల్లయ్య, టి.సుబ్బరామిరెడ్డి, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జస్టిస్ సుభాషణ్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి. మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్రెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, డీకే అరుణ, సమర సింహారెడ్డి, ఉమావెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, కిష్టయ్య, దైవజ్ఞశర్మ, ఏఐసీసీ సభ్యుడు ఎం.సూర్యనాయక్, మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆయన సమాధి, విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మర్రి చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
Related News by category
-
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా అరుణ పతాకం రెపరెపలతో ప్రపంచ వ్యాప్తంగా సభలు ప్రదర్శనలతో... మే డే వచ్చింది. సకల దేశాల జాతుల మతాల, కులాల కార్మికులంతా ఒకటేనని ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ దినమే మే డే. 19వ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఇంగ్లండ్ కేంద్రంగా యూరప్ అమెరికా లలో సంభవించిన పారిశ్రామిక విప్లవ ఫలితంగా కార్మిక వర్గం పుట్టుకతోనే సంఘటిత సమరశీల పోరాటాలకు నాంది పలికింది.ఆవిరి యంత్రం, జౌళి యంత్రాలు, రైళ్లు, టెలిగ్రాఫ్, మర మగ్గం తదితర అనేక యంత్ర సాధనాలను కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం జరిగింది. దీని వలన అంతకు ముందు ఉన్న భూస్వామ్య ఉత్పత్తి వ్యవస్థ నిర్మూలించబడి పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ అమలులోకి వచ్చింది. కార్మిక వర్గంపై పెట్టు బడిదారీ వర్గ దోపిడీ తీవ్రంగా కొనసాగుతున్న కాలంలో కార్మిక వర్గం తమ సమస్యల కోసం సంఘటితంగా పోరాడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈ పరిస్థితుల మధ్య 18 – 16 గంటల పని నుండి 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం రక్తతర్పణ చేసిన దినమే మే డేగా ప్రసిద్ధి చెందింది. 1923 మే 1వ తేదీన లేబర్ కిసాన్ పార్టీ నాయకుడు (ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ) సింగార వేలు ఎర్రజెండాను ఎగరవేయడంతో ఆనాటి నుండి భారతదేశంలో కార్మిక వర్గం మే డేను జరపడం కొనసాగుతూ వస్తున్నది. రష్యాలో మేడే ఉత్సవాల్లో అక్కడి కమ్యూనిస్ట్ నాయకులు 8 పని గంటల డిమాండ్తో పాటు చిన్న చిన్న ఆర్థిక డిమాండ్లను చేర్చడాన్ని లెనిన్ నిరసించినాడు. మే డే రాజకీయ స్వభావాన్ని తక్కువ చేసే ఆర్థిక డిమాండ్లు చేర్చ డాన్ని లెనిన్ వ్యతిరేకించారు. మే డే సందర్భంగా కార్మిక వర్గం రాజకీయ లక్ష్య సాధన కోసం ప్రతిన పూనాలని ఆయన చెప్పారు.ఆ తర్వాత కాలంలో మే డే అంతర్జాతీయ కార్మిక వర్గానికి కేంద్ర బిందువు అయింది. ఎన్నో రాజకీయ డిమాండ్లు వివిధ సందర్భాల్లో చేర్చబడ్డాయి. అంతర్జాతీయ కార్మిక వర్గ సంఘీ భావం, అందరికీ ఓటు హక్కు, సామ్రాజ్యవాద యుద్ధ వ్యతిరేకత, వలసవాద అణచివేత వ్యతిరేకత, రాజకీయార్థిక సంఘాలు ఏర్పర చుకునే హక్కు, రాజకీయ ఖైదీల విడుదల వంటివి అందులో కొన్ని.మే డే రాజకీయ చరిత్ర ప్రాముఖ్యాన్ని రూపుమాపేందుకు అమెరికా బూర్జువా సంస్కరణ వాద, అవకాశవాద సంఘ నాయ కులు మే డే నాడు ప్రదర్శనలు కాకుండా సెలవు రోజు అయిన ఆది వారం జరపాలని 1890 లోనే నిర్ణయించారు. ఇటువంటి కుట్ర తోనే అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అవకాశవాద నాయకులు మే డేకు ప్రతిగా సెప్టెంబర్ ఒకటిని లేబర్ డేగా నిర్ణయించారు. అమెరికన్ ప్రభుత్వ కుట్ర పూరితంగా మే మొదటి తేదీని బాలల ఆరోగ్య దినంగా ప్రకటించింది.భారతదేశంలో మతోన్మాద అనుబంధ కార్మిక సంఘం అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ మే డేని గుర్తించకుండా ‘విశ్వ కర్మ దినం’ జరుపుతు న్నారు. మే డేకు ఉన్న వర్గ స్వభా వాన్ని మొద్దుబార్చడానికి మే డే రాజకీయ స్వభావాన్ని దెబ్బతీయ డానికి ప్రభుత్వాలు, వివిధ సంస్కరణ వాద అవకాశవాద ట్రేడ్ యూనియన్లు మే డేను రికార్డింగ్ డ్యాన్సులతో పండుగలుగా జరుపుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మే నెల మొదటి రోజున ప్రపంచ కార్మిక వర్గం కమ్యూనిస్టు పార్టీలు అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు.శ్రామిక ప్రజల దోపిడీకి, అణచివేతకు, మానవ సమాజం ఎదుర్కొంటున్న సకల ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు మూల కారణంగా ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కార్మిక వర్గం సంసిద్ధం కావాలనే మే డే చారిత్రక పిలుపును శ్రామిక వర్గం ఎత్తి పట్టాలి.కార్మిక వర్గ అంతర్జాతీయత వర్ధిల్లాలి!ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి!! – జంపన్న ‘ మార్క్సిస్ట్–లెనినిస్ట్ నాయకుడు(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం – మే డే) -
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన చంద్రబాబు 2009లోనైనా గెలవాలని లెక్కకు మిక్కిలి హామీలనిచ్చారు. అయినా ఓడారు. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ల పొత్తుతోపాటు, ఎడాపెడా హామీలనిచ్చి గెలిచారు కానీ వాటిని అమలు చేయటంలో విఫలమయ్యారు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడారు. అందుకే ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! ఈసారి మళ్లీ ఎలాగైనా గెలవాలని బడ్జెట్తో నిమిత్తం లేకుండా హామీలను గుప్పిస్తు న్నారు. అలా కాదంటే, దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంతవుతుందో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి.చరిత్ర మొదటిసారి విషాదంగా, రెండవసారి ప్రహసనంగా పునరావృతమవుతుందంటాడు కార్ల్ మార్క్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల హామీలను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2004 ఎన్నికలలో ఓడిన ఆయన 2009లోనైనా గెలవాలని లెక్కకు అందనన్ని హామీలనిచ్చారు. అయినా ఓడారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 2019లో ఓడిన ఆయన 2024లోనైనా గెలిచి తీరాలనుకుంటూ తిరిగి ఉచితాల హామీలను కుప్పలుతెప్పలుగా ఇస్తున్నారు. ఆయనలోని ఈ లక్షణాన్ని గమనించినందుకే 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు ‘ఆల్ ఫ్రీ బాబు’ అని పేరు పెట్టారు.2009 ఎన్నికల ప్రచారం నాటి ఒక జ్ఞాపకం ప్రస్తుత సందర్భంలో మళ్ళీమళ్ళీ గుర్తుకు వస్తున్నది. అప్పుడు చంద్రబాబు ప్రతి సభలో తన ఉచిత హామీలను ఒక దానిని మించి మరొకటి ప్రకటిస్తుండే వారు. దానిపై రాజశేఖరరెడ్డి కూడా ప్రతి సభలో, ‘‘చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అయిపోయారు. అన్నీ ఫ్రీగా ఇస్తారట. నమ్ముతారా?’’ అని ప్రజలను నేరుగా అడిగేవారు. అందుకు జవాబుగా ప్రజల నుంచి ‘‘నమ్మం, నమ్మం’’ అనే కేకలు పెద్ద ఎత్తున వినిపించేవి. చివరకు చంద్రబాబు అన్నన్ని హామీలిచ్చి కూడా రెండవసారి ఓడిపోయారు. ఇందులో చెప్పుకోవలసిన విశేషం మరొకటి ఉంది. తనవైపు నుంచి తాను కూడా 2004లో కొన్ని హామీలిచ్చిన రాజశేఖరరెడ్డి, 2009లో కొత్తగా దాదాపు ఏమీ ఇవ్వలేదు. అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య, మరికొన్ని హామీలను బడ్జెట్ భరించలేదని చెప్పటం అందుకు కారణ మని అప్పుడు విన్నాము. దానితో రాజశేఖర రెడ్డికి చంద్రబాబు హామీలు అలవికానివనీ, కేవలం ఎన్నికలలో గెలిచేందుకు ఉచితాల వర్షం కురిపిస్తున్నారనీ అర్థమైంది. అప్పుడు, తన ప్రచారానికి కొత్త హామీలను కాకుండా 2004–2009 మధ్య కాలపు తన సమర్థవంతమైన పాలనను, దానిపట్ల ప్రజలకు కలిగిన విశ్వాసాన్ని ఆధారం చేసుకోదలిచారు. ఈ ఆలోచన, అందుకు అనుగుణమైన ప్రచారం పనిచేశాయి. ఫలితం తెలిసిందే.రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిందేమిటో చూడండి. 2014లో బీజేపీ, పవన్ కల్యాణ్ల పొత్తుతో గెలిచిన చంద్రబాబు, అటువంటి పొత్తు ఉండి కూడా, ఏ పొత్తూ లేని జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఎడాపెడా హామీలు ఇవ్వవలసి వచ్చింది. కానీ వాటిని అమలు చేయటంలో విఫలమై, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, 2019లో ఓడి పోయారు. తన పాలన ప్రజలను మెప్పించి ఉంటే, ఈ రెండవసారి పొత్తులు ఉన్నా లేకున్నా గెలవాల్సింది. కానీ అది జరగకపోగా, ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, కొత్త రాష్ట్ర చరిత్ర కలిసి ఆయనకు అలవికాని హామీల చంద్రబాబుగా పేరు తెచ్చాయి. మరొక విధంగా చెప్పాలంటే, అధికారం కోసం ప్రజలకు మోసపూరిత హామీలనిచ్చే నాయకునిగా అన్నమాట! తెలుగునాట ఎన్నికల చరిత్రలో ఇటువంటి అప్రతిష్ఠ సంపాదించిన నాయకుడు మరెవ్వరూ లేరు. తన 2004 నాటి ఎన్నికల ఓటమిని గమనిస్తే ఈ మాట మరింత బాగా అర్థమ వుతుంది. ఎన్నికలకు కొద్దిముందు తిరుపతి వద్ద ఆయనపైన నక్స లైట్ దాడి జరిగింది. ఆ స్థాయి గల ఒక నాయకునిపై అంత తీవ్రమైన దాడి జరగటం అదే మొదలు, అదే ఆఖరు. అటువంటపుడు తన పట్ల చాలా సానుభూతి రావలసింది! అయినప్పటికీ అందువల్లగానీ, తన పాలనా ప్రతిష్ఠవల్ల గానీ గెలవగలననే నమ్మకం ఏర్పడని చంద్రబాబు, ముఖ్యంగా రైతుల కోసం, గ్రామీణుల కోసం డజన్ల కొద్దీ వరాలు ప్రకటించారు. అయినా గెలవలేదు.ఎన్టీఆర్ ఉదంతాన్ని అట్లుంచినా, చంద్రబాబుకు సామాన్య ప్రజల సంక్షేమం కోరే నాయకునిగా ఎన్నడూ పేరు లేదు. అధికారానికి వచ్చిన కొత్తనుంచే అప్పటి ఆర్థిక సంస్కరణలను ఎంతో ఉత్సాహంగా భుజాన వేసుకున్న ఆయన తనను తాను సీఈఓగా చెప్పుకొన్నారు. సంస్కరణలకు దేశంలో అందరికీ మించిన పతాకధారి అయ్యారు. ఆ విషయంలో మన్మోహన్ సింగ్ను సైతం మించిపోయి దేశ విదేశాల లోనూ పేరు సంపాదించి ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్లకు ప్రీతి పాత్రు డయ్యారు. కానీ ఆ క్రమంలో వ్యాపార వర్గాలకు ఎంత దగ్గరయ్యారో సామాన్య ప్రజలకు అంత దూరమయ్యారు. లోగడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు, తర్వాత ఎన్టీఆర్ అమలుపరచిన సంక్షేమ పథకాలను తగ్గించి వేశారు లేదా రద్దుపరచారు. అందుకే ప్రజల విశ్వాసం కోల్పోయి 2004లో పరాజయం పాలవగా, ఆ పరిణామం ప్రజలను సంతోషపెట్టింది. కనీసం ఆర్థిక సంస్కరణలకీ, ఇండియా వంటి వెనుకబడిన సమాజంలో ప్రజా సంక్షేమానికీ మధ్య సమతులనాన్ని పాటించాలనే విజ్ఞత అయినా తనకు లేకపోయింది. అందువల్లనే ఈ 21వ శతాబ్దంలో జరిగిన నాలుగు ఎన్నికలలో (2004, 2009, 2014, 2019) మూడింట ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అయిదవ ఎన్నికను ఎదుర్కొంటున్నారు. తన ఆర్థిక సంస్కరణలు, పరిపాలన గొప్పగా ఉండి ఉంటే ప్రతిసారీ గెలవవలసింది! అది కూడా పొత్తుల కోసం చూడకుండా.ప్రతిసారీ తన ప్రత్యర్థులను మించి ఎడాపెడా హామీలు ఇస్తున్నారంటేనే చంద్రబాబు బలహీనత అర్థమవుతున్నది. మరొక వైపు 2014లో వలె గెలిచినపుడు అయినా సదరు హామీలను ఎంత మాత్రం అమలుపరచక విఫలం కావటాన్ని బట్టి అవి బడ్జెట్తో, ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేనివని తెలిసిపోతున్నది. అవి అలవిమాలినవని ముందుగా గ్రహించలేనివాడు కాదాయన. అయినప్పటికీ ఆ పని చేశా రంటే, 2014లో, 2019లో చేసి, ఇపుడు 2024 కోసం తిరిగి చేస్తున్నా రంటే, ఆయన ఉద్దేశమే ప్రజలను మోసగించటమనుకోవాలి. ఏమి చేసైనా సరే అధికారం సంపాదించాలన్నమాట!అదే పని చేసి తలమీదకు తెచ్చుకున్న రెండు ప్రభుత్వాల ఉదాహరణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్నాయి. ఒకటి కర్ణాటక, రెండు తెలంగాణ. రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ మితి మీరిన హామీలనిచ్చింది. అవి బడ్జెట్ శక్తికి మించిపోగలవని ఆర్థిక వేత్తలు ముందుగానే హెచ్చరించారు. అయినా పెడచెవిని పెట్టిన కాంగ్రెస్ ప్రజలను మభ్యపుచ్చి అధికారాన్నయితే సంపాదించింది గానీ, హామీలను అమలుపరచలేక ఏడాది తిరగకముందే తలకిందులవు తున్నది. ప్రజలలో నిరసనలు రెండు రాష్ట్రాలలోనూ మొదలయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఈసారి ఇచ్చిన హామీలకు ఏటా సుమారు లక్షన్నర కోట్లు అవసరం కాగలవన్నది ఒక అంచనా. అది నిజం కాదని తెలుగుదేశం అధ్యక్షుడు చెప్పదలచుకుంటే, తన హామీలలో దేనికెంత సొమ్ము అవసరమో, మొత్తానికి కలిపి ఎంత అవుతుందో, రాష్ట్ర బడ్జెట్తో పోల్చినపుడు పరిస్థితి ఏమిటో పోలింగుకు తగినంత ముందే ప్రజల పరిశీలన కోసం ప్రకటించాలి. అది నిజాయితీగల పద్ధతి అవుతుంది. ప్రజలు విజ్ఞులని స్వయంగా చంద్ర బాబు తరచూ గంభీరంగా ప్రకటిస్తుంటారు. ఒక నాయకుని గత పాలనలో ప్రజలకు కలిగే అనుభవం కూడా విజ్ఞతలోకి వస్తుంది.అందువల్ల, చంద్రబాబు గురించి ప్రజల గత కాలపు నిరాశలను, అప నమ్మకాలను మరచిపోయేటట్లు చేయాలంటే, ఆయన ఈ వివరాలు వెంటనే ప్రకటించాలి. లేనట్లయితే, ఆయనకు 2009లో రాజశేఖర రెడ్డి పెట్టిన ‘ఆల్ ఫ్రీ బాబు’ పేరును ప్రజలు తిరిగి గుర్తు చేసుకోగలరు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
మేమంతా ‘సిద్దం’ బస్సు యాత్రముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలోచనలో పడేసింది. “ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని ఎవరికి వోటు వేయాలోమీరు చర్చించుకోండి...” అన్నారు.ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ “నా వల్ల మేలు జరిగితే నాకు వోటు వేయండి” అని చెప్పిన సిఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్’గా మార్చారు. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికిఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పని వాళ్లకు అప్పగించారు. వినడానికి ఇది సాదాసీదా ప్రకటనగా ఉన్నప్పటికీ, ‘పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని...’ అనిఅనడం ద్వారా జగన్ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు.కొన్ని కుటుంబాలు ఒక నిర్ణయం తీసువడం అంటే, ఎక్కడో పనిచేస్తూ ‘పోలింగ్’ రోజు ఊళ్లోకి వచ్చేవారి పిల్లలతో‘ఫోన్’లోమాట్లాడి కూడా కావొచ్చు. జగన్ చెప్పాడు- “కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...” అనేది అ చర్చలో కీలకం అవుతుంది. అయితేవారి‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి.మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్ జెనరేషన్) ఏమనుకుంటున్నది అనేదిప్రధానం అవుతున్నది.నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువతరం తమ ఆర్ధిక ప్రయోజనాన్ని మించి మరీ,సామాజిక కోణంలో రాజకీయ స్పృహను పెంచుకుంటున్న తీరు ఈ ఎన్నికల్లోస్పష్టంగా కనిపిస్తున్నది.ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు విశ్లేషకులు ఈ పార్టీకి నాయకులు తప్ప ‘కేడర్’ లేదు అనేవారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత ఆ ఖాళీ చాలావరకు నిండింది. అయితే, ఏప్రెల్ చివరి వారంలో ఈ పార్టీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి‘సోషల్ మీడియా వారియర్స్’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్ కోసం స్వచ్చందంగా పనిచేసినఅదృశ్య ‘కేడర్’ ఇది. అభిమానమే అర్హతగా తలుపులు లేని పుష్పక విమానమిది. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి రెండు రకాల యుద్దాలు అంటారు తత్వవేత్తలు.ఒకటి-'టెరిటోరియల్ బ్యాటిల్' మరొకటి-'ఐడిలాజికల్ బ్యాటిల్'. దీన్నేజగన్-‘పేదల కోసం పెత్తందార్లతో తన ప్రభుత్వం చేస్తున్న యుద్ధం’అంటారు.కావొచ్చు కూడా మరిఅటువంటప్పుడుఒక ప్రాంతం కోసం నాయకుడు తనను తానుకట్టేసుకోవడం రెండవ రకం యుద్ధం అయితే కావొచ్చు.అదలా ఉంచి స్వచ్చందంగా ‘సోషల్ మీడియా వారియర్స్’ఈ పార్టీని ఇలా ‘వోన్’ చేసుకోవడానికి మూడుకారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పదవితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం.రెండు- సంస్కరణలు వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు- మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న2019 ఎన్నికల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్ఫార్మింగ్) దశలో ఉన్నప్పుడు,తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువతఇప్పుడుపూర్తి స్పష్టతతో ఉంది. రేపటి వారి అవసరాలు,వారి పిల్లల అవసరాలు వారికీ ప్రధానం. వాటివెనుక- ఆర్ధికం సామాజికం సాంస్కృతికం ప్రాంతీయం ఇన్ని అంశాల నేపధ్యాలు ఉన్నాయి.ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధాన్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్’కు గురి అవుతున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్ధం చేసుకుంటున్నది ఎవరు?అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్ధమయింది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరుపేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అటువంటివి వాళ్లకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచుకోవవడమే కాకుండా,నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడనివ్యక్తీకరణ ఒక‘హై వోల్టేజ్’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసినప్పుడు, రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది- ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వాలంటీర్ల’ వద్దకు ‘ఆన్ లైన్’లోఅది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదొ వంకతో అ సేవలను నిలపాలనే వర్గాల నైజం కూడా అర్ధమయింది. జరుగుతున్న ‘యుద్దం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశబ్దవిజయం అనుకొంటున్నారు. రెండవది- గడచిన ఇరవై ఏళ్లుగాచిన్న’బ్యాగ్’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికిజీవిక వెతుక్కుంటూవెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలిఅనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు వున్నఈ- ‘ఫీల్ గుడ్’ వాతావరణంతో పాటుగా,వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్దమయిన ‘లాజిస్టిక్స్’, వాటికితోడుగావిస్తరిస్తున్న మౌలిక వసతుల వల్లఇకముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయనికొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ మొదలైంది. గల్ఫ్ ముడిచమురుపై భారత్ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. పైగా యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. అత్యధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా అన్నది!పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తీవ్రత, నష్టం ఏమిటన్నవి ఇంకా అంచనా వేయాల్సే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బాహ్య పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాగలవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ , రష్యా మధ్య 2022లో యుద్ధం మొదలైన తరువాత పలు దేశాల్లో పరిస్థితులు మారినట్లే పశ్చిమాసియా పరిణామాలు కూడా అంతర్జాతీయంగానే కాకుండా, స్థానికంగానూ కలకలం సృష్టించనున్నాయి. పరిస్థితి సద్దు మణగకుంటే... లేదా మరింత దిగజారితే ఇప్పటికే ఎదురవుతున్న పలు సవాళ్లను తట్టుకోవడం కష్టమని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాదు... కొన్ని అసందిగ్ధ పరిస్థితులు ఎదు ర్కోవాల్సి రావచ్చు అని కూడా ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సప్లై చెయిన్ లో వచ్చే ఇబ్బందుల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు కేంద్ర మంత్రి. ఆర్థిక పరిపుష్టి మార్గంలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలు అర్థం చేసుకోదగ్గవే. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) 7 శాతం కంటే ఎక్కువ ఉండవచ్చునని ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న వేళ అంతర్జా తీయ సంస్థలు కూడా తమ అంచనాలను సవరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంత ర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్) ఇటీవలే భారత్ జీడీపీ వృద్ధిరేటును 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 6.4 నుంచి 6.6 శాతానికీ, ‘స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్’ 6.4 నుంచి 6.8 శాతానికీ ఈ ఆర్థిక సంవత్సరపు భారత జీడీపీ రేటును సవరించాయి. అయితే ఈ అద్భుతమైన పురోగతిని అంతర్జాతీయ అంశాలు నిరాశా పూరితం చేసే అవకాశం ఉంది. రానున్న వారాల్లో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఒక దశ దాటాయంటే మాత్రం ఇప్పటివరకూ హెచ్చరికలు అనుకుంటున్న పలు ఘటనలు వాస్తవం కావచ్చు. ఒకవేళ ఇరాన్ తన హోర్ముజ్ జలసంధి ద్వారా ముడిచమురు, సహజవాయువు రవాణాలను నిలిపివేసిందని అనుకుందాం. పెర్షియన్ , ఒమాన్ గల్ఫ్లను కలిపే ఈ సన్నటి రవాణా మార్గాన్ని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ గుర్తించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి రవాణా అయ్యే ముడిచమురులో 80 శాతం ఈ జలసంధి ద్వారానే ఖండాలు మారుతుంది. భారత దేశం కూడా ఈ ప్రాంతపు ముడిచమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మనపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. భారత్ ఉపయోగించే ముడిచమురులో 30 శాతం వరకూ రష్యా నుంచే వస్తున్నా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా, పశ్చిమాసియా, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తూండటం గమనార్హం. హోర్ముజ్ జలసంధి ఎంత కీలకమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే సూయిజ్ కాలువను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఆసియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఈ కాలువకు వెళ్లే మార్గం బాబ్ ఎల్–మందేబ్ అనే చిన్న కాలువ దగ్గరి నుంచి మొదలవుతుంది. యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న ప్రాంతమిదే. వీరంతా హమాస్కు మద్దతుగా ఉన్నవారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రవాణా కొంత ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ (దక్షిణాఫ్రికా) మీదుగా మళ్లింది. ఫలితంగా రవాణ ఖర్చులు పెరిగిపోవడమే కాదు... సమయం కూడా ఎక్కువవుతోంది. పరిస్థితి ముదిరితే అత్య ధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కష్టమవుతుంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎగుమతులు స్తంభించిపోతే వాణిజ్య ప్రవాహాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతాయి.మూడో ప్రమాదం ఇంకోటి ఉంది. యుద్ధం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. బారెల్కు 75–80 డాలర్ల అత్యంత తక్కువ శ్రేణి ధరలు ఇప్పటికే లేకుండాపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడిచమురు ధరలు 87 నుంచి 89 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇప్పటికైతే ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఘర్షణ ఈ ధరల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇంకొంచెం తీవ్రమైతే అవి పెరగడం ఖాయం.ముడిచమురు ధరలు పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయి. కరెంట్ అకౌంట్పై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోలు, డీజిళ్ల ధరలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే కోరుతూండటం గమనార్హం. ఇది బహుశా ఎన్నికల తరువాతే జరగవచ్చు. అయినా, ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడటం ఖాయం. ముడి చమురుకు మనం పెట్టే ఖర్చు మాటెలా ఉన్నా... పశ్చిమాసియా మీద అలుముకున్న యుద్ధమేఘాలు తొలగకపోతే మన వ్యూహా త్మక అవసరాల కోసం స్థిరంగా చమురు అందుబాటులో ఉండటమూ అత్యంత కీలకమే. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగు మతులతోనే తీరుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే?... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా? అన్నది. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు కానీ... మనకు మిత్రదేశాలే అయిన ఇజ్రాయెల్, ఇరాన్ లకు నిగ్రహం పాటించమని కోరడం మాత్రం చేయదగ్గ పనే. ముడిచమురు విషయానికి వస్తే ఇటీవలి కాలంలో వేర్వేరు మార్గాల ద్వారా కొను గోలు చేయడం కొంచెం ఎక్కువైంది. అలాగని గల్ఫ్ నుంచి వచ్చే లోటు మొత్తం భర్తీ అవుతుందని కాదు. కానీ ఈ మార్గాల గుండా వచ్చే ఇతర సరుకుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయాలు వెత కడం అసాధ్యం. కానీ ఈ ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిణామాలే ఎదురైతే రానూ పోనూ సరుకుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి.ఘర్షణ తాలూకు ఇతర ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయ లేము. కానీ ఉదాహరణకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వేర్వేరు లోహాల ధరలు అమాంతం పెరిగాయి. సన్ ఫ్లవర్ నూనెలు దొరక్కుండా పోయాయి. ఇలాగే పశ్చిమాసియాలో యుద్ధం లాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య పరిణామాలు తప్పకుండా ఉంటాయి. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే... పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని మాత్రమే ఎవరైనా కోరుకోగలిగేది!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సామాజిక న్యాయపాలనే గెలిపిస్తుంది!
ఇటీవల విశాఖపట్టణంలో ఓ దళిత మేధావుల సమా వేశంలో పాల్గొన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిపై చర్చ జరి గింది. ఈ సమావేశంలో 90 శాతం దళితులు, క్రైస్తవులు ఉన్నారు. జగన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చే విధంగా అసెంబ్లీ తీర్మానం చేసిన కారణంగా, ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. నయా మనువాది చంద్రబాబు నాయుడుకీ, అతని కూటమికీ ఓటు వేయకుండా తిరిగి రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే దృక్పథంతో దళిత సమాజం ఉందనేది వారి మాటల సారాంశం.విద్యా, వైద్య రంగాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు జగన్. ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, ఆ కుటుంబం ప్రభుత్వ రాయితీల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ భారం తగ్గిపోతుంది. పదేళ్ల కాలంలో 40 శాతం, మరో పది సంవత్సరాల కాలంలో మరో 50 శాతం మొత్తం 20 సంవత్సరాల కాలంలో 90 శాతం సబ్సిడీ పథకం కింద లబ్ధిపొందే వారు, అభివృద్ధి పథకాల కింద లబ్ధిపొందే వారు అభివృద్ధి చెంది ఈ పథకాలను అంటే పెన్షన్ పథకం, సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి ఈ కుటుంబాలు ఎదిగి పోతాయి. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 90 శాతం బడ్జెట్ తగ్గిపోతుంది. సామాజిక న్యాయాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.తాజాగా ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ప్రకటించిన ఎంపీ సీట్లలో 11 సీట్లనూ; అసెంబ్లీ సీట్లలో 48 సీట్లనూ బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొత్తం కలిపి 100 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇది దేశంలోనే ఓ రికార్డు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంత ప్రాతినిధ్యం ఆ యా వర్గాలకు ఇవ్వడం కనిపించదు. అలాగే ఇటీవల 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించి చరిత్రను తిరగరాశారు.గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహా విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. అలాగే కాంట్రాక్టు పనులలో వారికి 50 శాతం కోటా కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్ల పోస్టులకు గాను మొత్తం 100 శాతం బీసీలకే కేటాయించారు. ఫలితంగా ఆ కులాలలో నాయకత్వ లక్షణాలు పెరిగాయి. రాజ్యసభలో మొత్తం 9 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటే... అందులో నలుగురు బీసీలు. శాసనసభ స్పీకర్; శాసన మండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్ పదవుల కేటాయింపు కూడా జగన్ సామాజిక న్యాయ దృష్టికి నిదర్శనంగా నిలిచాయి. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఆ మేర బీసీలకు జరిగే నష్టాన్ని పూరించడానికి పార్టీ పరంగా అదనంగా 20 శాతం ఆ వర్గానికి పెంచి మొత్తం 44 శాతం స్థానాలను బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. చివరగా ముగించే ముందు మూడు రాజ ధానుల అంశం కూడా పరిపాలన విభజనలో భాగంగా నేను చూస్తాను. సంపద సృష్టి జరగా లన్నా, సంపద పంపిణీ జరగాలన్నా ఒకే ప్రాంతం / లేదా సిటీ అభివృద్ధి చెందితే జరగదు. అందుకే కోస్తాంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహణ రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును చేయాలని జగన్ సంకల్పించారు. అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి నమూనా కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సామాజిక న్యాయ కోవిదులు కూడా ఆశిస్తున్నారు.ప్రొ‘‘ గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఉస్మానియా, తెలంగాణ విశ్వ విద్యాలయాల మాజీ డీన్–ఫ్యాకల్టీ ఆఫ్ లా
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement