
ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం మూడూ ముఖ్యమే: దువ్వూరి
ద్రవ్యపరపతి విధానాల సందర్భంగా తాను ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే అధిక ప్రాధాన్యమిస్తూ, వృద్ధిరేటును విస్మరించానన్న వాదనను రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: ద్రవ్యపరపతి విధానాల సందర్భంగా తాను ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికే అధిక ప్రాధాన్యమిస్తూ, వృద్ధిరేటును విస్మరించానన్న వాదనను రిజర్వు బ్యాంకు గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తోసిపుచ్చారు. శనివారం ప్రధాని అధికార నివాసంలో జరిగిన ఆర్బీఐ చరిత్ర నాలుగో సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ పరపతి విధానానికి ద్రవ్యోల్బణం-వృద్ధి-ఆర్థిక స్థిరత్వం... మూడూ ముఖ్యమైన అంశాలేనని స్పష్టం చేశారు. దిగువస్థాయిలో స్థిరంగా కొనసాగే ద్రవ్యోల్బణం సమగ్రాభివృద్ధికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.