ముజఫర్నగర్లో ఇద్దరు సాధువుల హత్య | Two sadhus shot dead in Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ముజఫర్నగర్లో ఇద్దరు సాధువుల హత్య

Oct 5 2013 2:05 PM | Updated on Sep 1 2017 11:22 PM

ముజఫర్నగర్ జిల్లాలోని షరాన్పూర్లో ఇద్దరు సాధువులను ఆగంతకులు కాల్చి చంపారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం ఇక్కడ వెల్లడించారు.

ముజఫర్నగర్ జిల్లాలోని షరాన్పూర్లో ఇద్దరు సాధువులను ఆగంతకులు కాల్చి చంపారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి శనివారం ఇక్కడ వెల్లడించారు. స్వామీ బల్ద్వానందా (35)తోపాటు ఆయన సహాయకుడు నరేంద్రని శుక్రవారం ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారని చెప్పారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నట్లు ఉన్నతాధికారి వివరించారు.

 

హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. అయితే  మతఘర్షణలతో అట్టుడిగి ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటున్న ముజఫర్నగర్ జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement