ఉగ్రవాదుల కాల్పులు : జవాన్లకు గాయాలు | Terrorists firing in myanmar border | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కాల్పులు : జవాన్లకు గాయాలు

Jan 16 2015 10:52 AM | Updated on Oct 2 2018 2:30 PM

భారత్ - మయన్మార్ సరిహద్దుల్లోని చందల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.

న్యూఢిల్లీ: భారత్ - మయన్మార్ సరిహద్దుల్లోని చందల్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సరిహద్దుల్లో పహారా కాస్తున్న అసోం రైఫిల్స్కు చెందిన జవాన్ల శిబిరాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. దాంతో తీవ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.

అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఇద్దరిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా.... వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. భద్రత దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నాధికారులు వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement