కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది: కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ నవ తెలంగాణను నిర్మాణమే మా ముందున్న కర్తవ్యం.
- దామోదర రాజనర్సింహ, డిప్యూటీ సీఎం
అమరవీరుల త్యాగ ఫలం తెలంగాణ: తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన రాజ్నాధ్సింగ్, సుష్మాస్వరాజ్, అద్వానీ, అరుణ్జెట్లీ తదితరులకు ధన్యవాదాలు. బీజేపీ వత్తిడి, పోరాటం కారణంగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణను కాంగ్రెస్ ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ విజయాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నాం.
- కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు: ప్రాంతాలుగా విడిపోయినా తెలుగుప్రజలంతా ఒక్కటే. రానున్న కాలంలోనూ అన్నదమ్ములుగా రెండు రాష్ట్రాలు పురోగమనంలో ముందుకు వెళ్లాలి. ద్వేషాలకు తావులేకుండా తెలుగుజాతి ఐక్యతను ప్రపంచానికి చాటాలి. తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తారని ఆశిస్తున్నాను.
- డి.శ్రీనివాస్, పీసీసీ మాజీ చీఫ్
కాంగ్రెస్కే ఓట్లేయండి: తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్టీకి అనేక ఒడిదుడుకులు, అష్టకష్టాలు, అపనిందలు ఎదురైనా, మరెన్నో విమర్శలొచ్చినా తొణకకుండా వ్యవహరించిన సోనియాగాంధీ విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు. 2014లో జరిగే ఎన్నికల్లో నూటికి నూరుశాతం కాంగ్రెస్కు ఓట్లేసి మద్దతు పలకాలి.
- కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ
ఇచ్చిన మాట నిలబెట్టుకుంది: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కేబినెట్ మంత్రులందరికీ కృతజ్ఞతలు.
- డి.శ్రీధర్బాబు, డీకే.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి
అమరవీరుల ఫైలుపై తొలి సంతకం చేయాలి: తెలంగాణ ప్రకటించినందుకు సోనియాగాంధీకి, కేంద్రానికి ధన్యవాదాలు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని ప్రకటిస్తూ తొలి సంతకం చేయాలి.
- పూల రవీందర్, టీచర్ ఎమ్మెల్సీ
అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుంది: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుంది. సోనియాగాంధీకి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలంతా ఆమెకు రుణపడి ఉంటారు.
- నిరంజన్, తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం(టీసీఎంజీ) కన్వీనర్
రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించాలి : నాన్చుడు ధోరణికి మారుపేరయిన కాంగ్రెస్ ఇంకా అనేక కుట్రలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్లోనైనా గందరగోళం సృష్టించకుండా రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలి.
- దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు
కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. వందలాది మందిని బలిగొన్నందుకు కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు.
- కూనంనేని సాంబశివరావు, సీపీఐ శాసనసభా పక్ష ఉపనాయకుడు
పార్లమెంట్లో ఏం చేస్తారో తేలాలి: భాషాప్రాతిపదిక రాష్ట్రాలకే మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర రాజకీయ అనిశ్చితిపై కాంగ్రెస్ ఇప్పటికీ దాగుడుమూతలు ఆడుతూనే ఉంది. పార్లమెంటులో కాంగ్రెస్ పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది.
- వై.వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
అమరుల త్యాగాల ఫలితమే: అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. పదిజిల్లాల తెలంగాణకే కేంద్రమంత్రివర్గం నిర్ణయం ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. కేంద్రం ఆలస్యం చేయకుండా వెంటనే బిల్లు పెట్టాలి.
- చుక్కారామయ్య, మాజీ ఎమ్మెల్సీ
సోనియాకు కృతజ్ఞతలు: 10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ప్రకటించినందుకు కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు. సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, అజిత్సింగ్కు ధన్యవాదాలు.
- దిలీప్కుమార్, ఎమ్మెల్సీ
ఇదే స్ఫూర్తితో చివరిదాకా: తెలంగాణ ఏర్పాటయ్యేదాకా ఇదే స్ఫూర్తితో అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో సామాజిక న్యాయంకోసం, ఇప్పటిదాకా కోరుకున్న ప్రగతికి మరోసారి అంకితం కావాలి.
- విమలక్క, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్
ఇది ప్రజా విజయం: తెలంగాణ సాధన ప్రజా విజయం. నవ తెలంగాణ నిర్మాణంలో ఇదే అంకితభావాన్ని చూపాలి. అమరవీరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ ఏర్పాటు.
- కె.గోవర్ధన్, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ నేత
బాధ్యత పెరిగింది: తెలంగాణ ఏర్పాటుతో ఇప్పటిదాకా చెప్పిన ప్రగతిని ఆచరణలో చూపించాల్సిన బాధ్యత సమష్టిగా పెరిగింది. తెలంగాణ ఏర్పాటయ్యేదాకా పార్లమెంటులో మా పార్టీ అండగా ఉంటుంది.
- దాస్యం ఉదయభాస్కర్, జేడీయూ రాష్ట్ర అధ్యక్షులు
త్యాగాల పొద్దుపొడుపు: త్యాగాల పొద్దుపొడుపులోంచి పుట్టినదే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం. సకలజనుల సబ్బండ వర్ణాల విజయమే సంపూర్ణ తెలంగాణ. అమరుల త్యాగఫలితం నెగ్గింది, తెలంగాణ ప్రజాపోరాటాలు విజయం సాధించాయి. - జూలూరు గౌరీశంకర్, టీ రచయితల వేదిక అధ్యక్షుడు