'శారద'పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం | Supreme court orders Central Bureau of Investigation probe into Saradha chit fund scam | Sakshi
Sakshi News home page

'శారద'పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం

May 9 2014 11:37 AM | Updated on Sep 2 2018 5:20 PM

'శారద'పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం - Sakshi

'శారద'పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం

తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్ఫండ్ స్కామ్పై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.

తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్ఫండ్ స్కామ్పై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. నగదు మదుపుదారులలో విశ్వాసం కలిగించేందుకే సీబీఐ విచారణకు ఆదేశించినట్లు ఆ ఆదేశాలలో పేర్కొంది. జస్టిస్ టీఎస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒడిశాలో సంచలనం కలిగించిన పొంజి స్కాంపై కూడా విచారణ జరపాలని ఆదేశించింది.

 

ఆ రెండు స్కాంలకు సంబంధం ఉండవచ్చని సుప్రీం ఈ సందర్బంగా అభిప్రాయపడింది. శారద చిట్ఫండ్ స్కాం మూలలు పశ్చిమబెంగాల్, ఒడిశాతోపాటు అసోం రాష్ట్రాలకు విస్తరించి ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే శారద స్కాంపై సుప్రీం కోర్టు ఆదేశాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు.

Advertisement
 
Advertisement
Advertisement