దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Dec 20 2016 9:45 AM | Updated on Sep 4 2017 11:12 PM
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 36.84 పాయింట్ల లాభంలో 26,411 గాను, నిఫ్టీ 9 పాయింట్ల లాభంలో 8113 గాను ట్రేడ్ అవుతోంది. ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్ల సపోర్టుతో నిఫ్టీ 8100 మార్కును స్థాయిని నిలుపుకోగలిగింది. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్ షేర్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడి 67.86గా ప్రారంభమైంది.
ఫెడరల్ మీటింగ్ ప్రకటనలు, ఇటీవల నెలకొన్న కొన్ని ప్రాంతీయ రాజకీయ ఆందోళనలతో డాలర్స్ ఇండెక్స్ పెంపు కొనసాగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు అశుతోష్ రైనా తెలిపారు. ప్రస్తుతం 103 లెవల్కి పైన ట్రేడ్ అవుతుందని చెప్పారు. మరోవైపు ఆసియన్ షేర్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి.
Advertisement
Advertisement