రూ.1,27,897 కోట్లు వివాదాలతో ఆగిపోయిన రాబడి! | Rs 1.27 lakh crore indirect tax revenue stuck in litigations | Sakshi
Sakshi News home page

రూ.1,27,897 కోట్లు వివాదాలతో ఆగిపోయిన రాబడి!

Sep 9 2013 4:03 AM | Updated on Sep 1 2017 10:33 PM

వివిధ విభాగాల్లో అప్పీళ్లు, వివాదాల కారణంగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1.27 లక్షల కోట్ల సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌ల రూపంలోని రాబడి వాస్తవరూపం దాల్చలేదని కాగ్ నివేదిక ఒకటి ఈ విషయం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: వివిధ విభాగాల్లో అప్పీళ్లు, వివాదాల కారణంగా 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1.27 లక్షల కోట్ల సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్‌ల రూపంలోని రాబడి వాస్తవరూపం దాల్చలేదని కాగ్ నివేదిక ఒకటి ఈ విషయం స్పష్టం చేసింది. మొత్తం రూ.1,27,897.39 కోట్ల పెండింగ్ రాబడిలో సర్వీసు ట్యాక్స్ పద్దులో రూ.73,274.74 కోట్లు ఉండగా, 54,172.65 కోట్లు ఎక్సైజ్ సుంకం కింద ఉన్నాయి. ఎక్సైజ్ సుంకం కేసులు వివిధ సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులోని రూ.15,663.69 కోట్ల (29%) మొత్తానికి సంబంధించిన కేసులు ఆ సంస్థ అధీకృత అధికారుల వద్ద ఉన్నాయి. ఇక 53% రాబడికి సంబంధించిన కేసులు కోర్టుల్లో ఉండగా, మిగతా మొత్తానికి అప్పీళ్ల కమిషనర్లు, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement