Sakshi News home page

'దానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదు'

Published Wed, Oct 8 2014 12:17 PM

నరేంద్ర మోడీ(ఫైల్) - Sakshi

ముంబై: మహారాష్ట్రపై దృష్టి పెట్టడం మానేని పాకిస్థాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమేలాగో ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోడీకి శివసేన సూచించింది. నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలపై పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతున్నా అదుపు చేయడంలో మోడీ సర్కారు విఫలమైందని 'సామ్నా' పత్రికలో శివసేన పేర్కొంది.

మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం మాని, పాకిస్థాన్ పై దృష్టి పెట్టాలని సలహాయిచ్చింది. దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి 56 అంగుళాల ఛాతి అవసరం లేదని, దృఢమైన సంకల్పం ఉంచే చాలని శివసేన పేర్కొంది. మహారాష్ట్ర రాజకీయాల గురించి తర్వాతైనా ఆలోచించొచ్చని, అంతకంటే ముందు పొరుగుదేశం దాడులపై స్పందించాలని కోరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement