నిజామబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్ | Nizamabad secured first place in voter ID card linking aadhar card | Sakshi
Sakshi News home page

నిజామబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్

Aug 3 2015 2:37 PM | Updated on Oct 17 2018 6:06 PM

ఈ నెల 15లోగా ఓటర్లందరూ ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ సూచించారు.

కరీంనగర్ : ఈ నెల 15లోగా ఓటర్లందరూ ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ సూచించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంద శాతం అనుసంధానంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, 87 శాతం అనుసంధానంతో నల్గొండ జిల్లా రెండోస్థానం ఉందని తెలిపారు.  ఇక 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు చెప్పారు.

హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్తో అనుసంధానం జరిగిందని భన్వర్లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసం మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఓటరు గుర్తింపు అడ్రసు, ఆధార్ కార్డు అడ్రస్కు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement