బీజేపీలో చేరిన కిరణ్ బేడీ | kiranbedi joins in bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన కిరణ్ బేడీ

Jan 15 2015 4:52 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీలో చేరిన కిరణ్ బేడీ - Sakshi

బీజేపీలో చేరిన కిరణ్ బేడీ

ఢిల్లీ: మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ చేరికతో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీ సీఎం ఎవరనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ కాషాయం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ... మోదీ పాలన తనలో స్పూర్తి నింపిదని ఆమె తెలిపారు. తానేప్పుడు పదవుల కోసం పని చేయడం లేదని ... తన జీవితం దేశానికే అంకితమని ఆమె స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా తన 40 ఏళ్ల అనుభవాన్ని ఢిల్లీ ప్రజలకు అర్పించేందుకే వచ్చానని కిరణ్బేడీ ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement