శ్రుతి హాసన్ను నేనేమీ అనలేదు: మంత్రి | I did not scold shruti haasan, says minister manikyala rao | Sakshi
Sakshi News home page

శ్రుతి హాసన్ను నేనేమీ అనలేదు: మంత్రి

Apr 11 2015 5:35 PM | Updated on Oct 2 2018 7:37 PM

శ్రుతి హాసన్ను నేనేమీ అనలేదు: మంత్రి - Sakshi

శ్రుతి హాసన్ను నేనేమీ అనలేదు: మంత్రి

శ్రుతిహాసన్ను తాను ఏమీ అనలేదని, అనాల్సిన అవసరం కూడా లేదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు.

శ్రుతిహాసన్ను తాను ఏమీ అనలేదని, అనాల్సిన అవసరం కూడా లేదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. హైదరాబాద్ - తిరుపతి విమానంలో వివాదం సందర్భంగా శ్రుతి హాసన్ ఏడ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, అందుకు ఓ బీజేపీ మంత్రి కారణమని కూడా రావడంతో ఈ విషయమై ఆయన 'సాక్షి టీవీ'కి వివరణ ఇచ్చారు.

తిరుపతి వెళ్లే విమానంలో శ్రుతి తన ముందు సీటులో ప్రయాణిస్తోందని మాణిక్యాలరావు చెప్పారు. ఆ సమయంలో తనకు అర్జంటుగా ఓ ఎస్ఎంఎస్ రావడంతో.. ఓ డాక్టర్కు ముఖ్యమైన కాల్ చేయాల్సి వచ్చిందన్నారు. తాను మాట్లాడుతుండగా శ్రుతి వారించిందని, విమానం వెళ్లేటప్పుడు మాట్లాడొద్దని సూచించిందని ఆయన అన్నారు. దాంతో తాను మాట్లాడుతున్నది అతి ముఖ్యమైన విషయమని మాత్రమే ఆమెకు చెప్పాను తప్ప.. అంతకు మించి ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. కాల్ గురించి కూడా ఎయిర్హోస్టెస్ తోనే మాట్లాడానన్నారు. సోషల్ మీడియాలో మాత్రం తానేదో అన్నట్లు, శ్రుతి కన్నీళ్లు పెట్టినట్లు వచ్చిందని.. అదంతా తప్పని మాణిక్యాలరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement