ఢిల్లీలో బాలికపై ఆటోవాలాల గ్యాంగ్‌రేప్ | girl allegedly gang raped by auto rickshaw drivers in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో బాలికపై ఆటోవాలాల గ్యాంగ్‌రేప్

Jan 11 2014 5:45 AM | Updated on Apr 4 2018 7:42 PM

ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ కొలువుదీరినా.. మహిళలకు ఇంకా అభద్రత తొలగిపోలేదు. దేశ రాజధానిలో కామాంధులు మరోసారి రెచ్చిపోయారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ కొలువుదీరినా.. మహిళలకు ఇంకా అభద్రత తొలగిపోలేదు. దేశ రాజధానిలో కామాంధులు మరోసారి రెచ్చిపోయారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు ఆటో డ్రైవర్లను గురువారం అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి బాలిక ఏదో పనిపై ఇంటి నుంచి బయటకు వచ్చి జీటీబీ ఆస్పత్రి ప్రాంతంలో తిరిగిందని.. బుధవారం రాత్రికి తూర్పు ఢిల్లీలోని బోపురా ప్రాంతానికి చేరుకుందని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో బాలికను గమనించిన ఆటో డ్రైవర్లు తమవెంట తీసుకెళ్లి అత్యాచారం చేశారన్నారు. వైద్యపరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది.

Advertisement
 
Advertisement
Advertisement