కొండపై నుంచి జారిపడిన బస్సు, 8 మంది మృతి | Eight killed in Himachal as bus rolls down hill | Sakshi
Sakshi News home page

కొండపై నుంచి జారిపడిన బస్సు, 8 మంది మృతి

Published Thu, Aug 13 2015 4:49 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

హిమాచల్ ప్రదేశ్లోని చంబా ప్రాంతంలో కొండపైనుంచి ఓ బస్సు జారిపడిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని చంబా ప్రాంతంలో కొండపైనుంచి ఓ బస్సు జారిపడిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. హిమాచల్ ఆర్టీసీ బస్సు చంబా టౌన్ నుంచి కిల్లర్ ప్రాంతానికి వెళుతుండగా తిస్సాకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం చంబా ప్రధాన కార్యాలయానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే కొండపై రోడ్డుమార్గంలో వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ జారి పడిందని ఏఎస్పీ కుల్వంత్ థకూర్ ఫోన్ ద్వారా ఐఏఎన్యస్కు వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఈ రోడ్డుప్రమాదంలో చాలామందికి గాయాలు అయ్యాయని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించమన్నారు. కాగా వీరంతా చంబా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement