గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు | delhi people not hearing to our demands, says butta renuka | Sakshi
Sakshi News home page

గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు

Aug 10 2015 2:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు - Sakshi

గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు

రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీని మర్చిపోయారని.. ఇప్పుడు దాన్ని తాము గుర్తుచేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వదిలేస్తున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు.

రాష్ట్రాన్ని విభజించిన సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీని మర్చిపోయారని.. ఇప్పుడు దాన్ని తాము గుర్తుచేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వదిలేస్తున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. ఆమె ఏమన్నారంటే...

  • హక్కును పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.
  • రాష్ట్రాన్ని విడగొట్టిన రోజు అందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కూడా హామీలిచ్చారు.
  • ఆ హామీలను పక్కనబెట్టి ఈ రోజు మన పరిస్థితిని వాళ్ల ముందు గోడు పెట్టుకున్నా వినిపించుకోని హీన స్థితిలో వదిలిపెట్టేశారు.
  • ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు వస్తాయని అంటున్నారు.
  • కానీ, ఏ రాష్ట్రాన్నీ ఇంత దారుణంగా విడగొట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎందుకు గ్రహించలేకపోతున్నారో ప్రశ్నార్థకమే.
  • ఎంపీలంతా గత వారం రోజుల నుంచి పార్లమెంటులో మా గోడు వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదు.
  • మాకు ఏదో సర్దిచెప్పాలని.. మీకు అన్యాయం చేయబోమని చెబుతున్నారు తప్ప న్యాయం ఎలా చేస్తారన్న స్పష్టత ఇవ్వడం లేదు.
  • ఇంకా ఎన్ని రోజులు ఇలా కాలాన్ని గడిపేస్తూ మభ్యపెడతారో. వాళ్లలో చలనాన్ని తీసుకురావాలి.
  • వాళ్లిచ్చిన హామీలను గుర్తు చేయాలన్న బాధ్యతతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పోరాటం ప్రారంభించారు.
  • మనకు ప్రత్యేక హోదా వచ్చేవరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్క పౌరుడికి విజ్ఞప్తి. ఇదే నమ్మకంతో ముందుకెళ్దాం.

Advertisement
 
Advertisement
Advertisement