పాకిస్థాన్ భూకంపం ఘటనలో 359 చేరిన మృతులు | Death toll in Pakistan quake reaches 359 | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ భూకంపం ఘటనలో 359 చేరిన మృతులు

Sep 28 2013 8:53 AM | Updated on Sep 1 2017 11:08 PM

పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 359కి చేరిందని ఉన్నతాధికారి జన్ మహ్మద్ బులెది శనివారం ఇక్కడ వెల్లడించారు.

పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 359కి చేరిందని ఉన్నతాధికారి జన్ మహ్మద్ బులెది శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో గాయపడిన వారు 755 మంది వరకు ఉన్నారని తెలిపారు. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భుకంపం సంభవించిన మారుమూల ప్రాంతాల్లో భద్రత సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారని వివరించారు.

 

భూకంపం ధాటికి బెలూచిస్థాన్ ప్రావెన్స్లోని అవారన్, కచ్ జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయని బులెది తెలిపారు. అయితే రెండు జిల్లాలో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్లోమంగళవారం భూకంపం సంభవించింది. రిక్టారె స్కేల్పై 7.7గా నమోదు అయింది. ఆ భూకంపం ధాటికి రోడ్డులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టడానికి తీవ్ర జాప్యం ఏర్పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement