న్యూఢిల్లీ: దేశం మళ్లీ అధిక వృద్ధిబాట పట్టే దిశగా వచ్చే ఆరు నెలల్లో క్యాపిటల్ మార్కెట్లు, ఆర్థిక రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. వచ్చే ఏడాది వృద్ధి రేటు 6 శాతానికి పెరగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను సరళీకరించడం, ప్రాజెక్టులకు ఆటంకాలను తొలగించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక అంశాలపై శుక్రవారం జరిగిన ఒక సదస్సులో చిదంబరం తెలిపారు. ‘నేను చేయాల్సిన పనులకు సంబంధించి పెద్ద చిట్టా ఉంది. దాన్ని రోజూ ఫాలో చేస్తుంటాను. క్యాపిటల్ మార్కెట్లను, ఆర్థిక రంగాన్ని సరళీకరించాలి.. గ్యాస్, చమురు ధరల సమస్యలను పరిష్కరించాలి. మరింత బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా బొగ్గు రంగంలో కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాం. నిల్చిపోయిన ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ మరిన్ని సార్లు భేటీ కానుంది. ఇలా చేయాల్సినవి చాలా ఉన్నాయి.. వీటన్నింటినీ కచ్చితంగా చేస్తాం’ అంటూ ఆయన వివరించారు.
ఒత్తిడి అధిగమించ గలం..
ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల తరహాలోనే భారత ఎకానమీ కూడా ఒత్తిడిలో ఉందని, అయితే దీన్ని కచ్చితంగా అధిగమించగలమని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. 2014-15లో వృద్ధి రేటు 6 శాతానికి చేరువలో ఉండగలదని, రెండేళ్ల వ్యవధిలో మరింత మెరుగుపడి 8 శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. 2012-13లో ఎకానమీ వృద్ధి పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ వృద్ధి..నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతంగా ఉండటాన్ని ప్రస్తావించిన చిదంబరం ఇది నిరాశపర్చిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తప్పటడుగులు వేయకుండా ఆర్థిక క్రమశిక్షణ బాటలో ముందుకు సాగాల్సి ఉంటుందని చిదంబరం చెప్పారు. పెట్టుబడులపై నిర్ణయాలను వేగవంతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అధిక వృద్ధికి బాటలు వేయగలవని పేర్కొన్నారు. భారత్పై ఇన్వెస్టర్ల అభిప్రాయం క్రమంగా మారుతోందన్నారు.
పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలి..
ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం చివరి రోజు వరకూ పాటుపడతామని చిదంబరం చెప్పారు. సరైన నిర్ణయం తీసుకున్నామా లేదా అన్నది ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఫలితాలను చూసే దాకా పరిశ్రమ వర్గాలు ఓపిక పట్టాలని పేర్కొన్నారు.
6 నెలల్లో మరిన్ని సంస్కరణలు
Published Sat, Nov 30 2013 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement