యూపీలోనూ ‘పడవ’ విషాదం | Boat capsizes in Uttar Pradesh's Hamirpur: 3 dead | Sakshi
Sakshi News home page

యూపీలోనూ ‘పడవ’ విషాదం

Jan 15 2017 10:51 AM | Updated on Sep 5 2017 1:17 AM

యూపీలోనూ ‘పడవ’ విషాదం

యూపీలోనూ ‘పడవ’ విషాదం

బిహార్‌ పడవ విషాదం మరువకముందే యూపీలోని విర్మా నదిపై ప్రయాణిస్తూ ముగ్గురు నీటమునిగారు.

హమీర్‌పూర్‌: బిహార్‌ రాజధాని పట్నాలో గంగానదిలో పడవ మునిగి 24 మంది చనిపోయిన కొద్ది గంటలకే పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. హమీపూర్‌ జిల్లా కేంద్రంలోని విర్మా నదిలో పడవ మునిగి ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 
 
మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలుకాగా, ఒకరు మహిళ. ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement