వైమానిక దాడుల్లో 30 మంది తీవ్రవాదులు హతం | 30 militants killed in fresh airstrikes in Pak's restive NW | Sakshi
Sakshi News home page

వైమానిక దాడుల్లో 30 మంది తీవ్రవాదులు హతం

Mar 25 2015 3:10 PM | Updated on Mar 28 2019 6:10 PM

పాకిస్థాన్ వాయువ్య ప్రాంతమైన ఖైబర్ ప్రావెన్స్లో తీవ్రవాద స్థావరాలపై బుధవారం ఆ దేశ సైన్యం వైమానిక దాడులు జరిపింది.

పెషావర్: పాకిస్థాన్ వాయువ్య ప్రాంతమైన ఖైబర్ ప్రావెన్స్లో తీవ్రవాద స్థావరాలపై బుధవారం ఆ దేశ సైన్యం వైమానిక దాడులు జరిపింది.  ఈ దాడుల్లో దాదాపు 30 మంది తీవ్రవాదులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. మృతి చెందిన తీవ్రవాదుల్లో కీలక కమాండర్లతోపాటు విదేశీ ఉగ్రవాదులు కూడా ఉన్నారని ఇంటర్ సర్వీసెస్స్ పబ్లిక్ రిలేషన్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

అయితే శనివారం ఖైబర్ జిల్లాలో భద్రత దళాలు,తీవ్రవాదుల మధ్య జరిగిన పోరులో 80 మంది తీవ్రవాదులు హతం కాగా, ఏడుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement