21న సంజీవయ్య పార్కులో 'యోగా డే' | Yoga day celebrations at Sanjeevaiah park on 21st June | Sakshi
Sakshi News home page

21న సంజీవయ్య పార్కులో 'యోగా డే'

Jun 16 2015 4:16 PM | Updated on Sep 3 2017 3:50 AM

స్థానిక సంజీవయ్య పార్కులో ఈ నెల 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు.

కాచిగూడ (హైదరాబాద్) : స్థానిక సంజీవయ్య పార్కులో ఈ నెల 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. బర్కత్‌పురలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, వాకర్స్, వివిధ యోగా కేంద్రాల నుంచి యోగా దివస్‌లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జయప్రకాష్ నడ్డ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న యోగా దినం  పాటించనున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement