ఓటుకో రేటు! | vote rate! | Sakshi
Sakshi News home page

ఓటుకో రేటు!

May 19 2014 2:46 AM | Updated on Sep 2 2017 7:31 AM

ల్వకుర్తి అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్న జూపల్లి గ్రామంలో ఓటుకో రేటు పలుకుతోంది. ఆయా పార్టీలు ప్రలోభాలపర్వానికి తెరతీశాయి.

కల్వకుర్తి అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్న జూపల్లి గ్రామంలో ఓటుకో రేటు పలుకుతోంది. ఆయా పార్టీలు ప్రలోభాలపర్వానికి తెరతీశాయి. గ్రామానికి బయటి వ్యక్తులను అనుమతించకపోవడంతో అంతా సెల్‌ఫోన్‌లోనే ప్రచారం సాగుతోంది. ఓటువేసి గెలిపించాల్సిందిగా ఓటర్ల బంధుగణం, సంబంధీకుల ద్వారా అభ్యర్థిస్తున్నారు. ఓటుకు రూ.10 వేల నుంచి రూ.15వేలు చొప్పున, ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే రూ.40వేలు ఇస్తున్నారు. ఫోన్ల ద్వారా శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలాలు, దాబాలు, మామిడితోటల వద్దకు ఓటర్లను పిలుపించుకుని ఎరవేస్తున్నారు..అడిగినంతా ఇచ్చేస్తున్నారు.
 
 వెల్దండ/కల్వకుర్తి, న్యూస్‌లైన్: కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి ఫలితం వెల్లడించే సమయంలో జూపల్లి 119 పోలింగ్‌బూత్‌లో ఈవీఎం మొరాయించిన విషయం విధితమే. విజ యం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రె డ్డి, బీజేపీ అభ్యర్థి టి.ఆచారి మధ్యే దో బూచులాడింది. లెక్కింపు సందర్భంగా ఈవీఎంలో సాంకేతికలోపం తలెత్తడంతో అధికారులు ఫలితాన్ని నిలిపేశారు. ఈ నే పథ్యంలో ఈ బూత్‌పరిధిలో రీపోలింగ్ అనివార్యమైంది. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సోమవారం ఎన్నిక ప్ర క్రియ నిర్వహిస్తున్నారు. జూపల్లి 9వ వా ర్డు, జేపల్లి, దొడ్లపల్లి, దొంగలగట్టుతం డా, నెమలిగుట్టతండాల పరిధిలో 867 ఓ ట్లు ఉన్నాయి.
 
 ఇక రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నియోజకవర్గంలో రీపోలింగ్ ని ర్వహించున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల తరుఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తీవ్రఅలజడి నెలకొంది. గెలుపోటముల్లో స్వల్పతేడా ఉండటంతో ఎన్ని ఇబ్బం దులు తలెత్తినా చివరివరకు ప్రయత్నించి గెలుపే లక్ష్యంగా ముందుకుసాగాలని కా ర్యకర్తలకు సూచించారు. దీంతో గతరెం డు రోజులుగా పగలు, రాత్రి అనే తేగా లేకుండా ఆ రెండు పార్టీల నాయకులు జూపల్లి గ్రామం, తండాలు అనే తేడా లేకుండా పొలాల్లో పాగావేసి, తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని కోరుతున్నారు.
 
 పోలీసు పహారాలో జూపల్లి
  రీ పోలింగ్ నేపథ్యంలో జూపల్లి పూర్తిగా పోలీసు పహారాలో ఉంది. ఓటర్‌కో పోలీసు చొప్పున బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు, జేసీ ఎల్. శర్మణ్, ఆర్డీఓ హన్మంతరావు సంద ర్శించారు. ఓటర్లకు స్లిప్పుల పంపిణీని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఇక పోలీసులు గ్రామశివారులో తనిఖీలు నిర్వహిస్తుండగా.. రూ.8లక్షలు పట్టుబడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆపిఉంచిన ఓ వాహనం నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement