మేడారంలో మొక్కులు చెల్లించిన ఉప రాష్ట్రపతి | Venkaiaha naidu visits Medaram | Sakshi
Sakshi News home page

మేడారంలో మొక్కులు చెల్లించిన ఉప రాష్ట్రపతి

Feb 2 2018 12:32 PM | Updated on Feb 2 2018 1:03 PM

Venkaiaha naidu visits Medaram - Sakshi

సాక్షి, మేడారం(జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా నిలవెత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ఆదివాసి కుంభమేళాగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. మరో వైపు వనదేవతల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.  మేడారం భక్తులతో జనసంద్రమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement