కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మూల్యం తప్పదు | Uttamkumar Reddy comments on Modi and KCR | Sakshi
Sakshi News home page

కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మూల్యం తప్పదు

Jun 2 2017 3:01 AM | Updated on Sep 19 2019 8:44 PM

‘ప్రత్యేక తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు.

‘ప్రజాగర్జన’ సభలో ఉత్తమ్‌ ధ్వజం
 
సాక్షి, సంగారెడ్డి: ‘ప్రత్యేక తెలంగాణలో ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయిందంటూ  టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సర్పంచ్‌ నుంచి ఎంపీ దాకా ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు మారుమూల గ్రామాల్లో వీర సైనికులుగా పోరాడుతున్నారన్నారు. ‘కార్యకర్తల వెంట ఐక్యంగా మేముంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టినా మూల్యం చెల్లించక తప్పదు’ అంటూ హెచ్చరించారు. సంగారెడ్డి అంబేడ్కర్‌ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు.

కేంద్ర రాష్ట్రాల్లో మూడేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి మేలూ కలగలేదనే అంశాన్ని రాష్ట్రమంతటా చాటేందుకే రాహుల్‌గాంధీ వచ్చారన్నారు. ‘ఆంధ్ర ప్రాంతంలో అధికారం కోల్పోతున్నామని తెలిసినా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి, చలించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సమాజానికి ఏ మేలూ జరగలేదు. విభజన బిల్లులోని ఏ హామీ అమలుకు నోచలేదు. ఖమ్మంలో స్టీల్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఎయిమ్స్‌ వంటివేమీ రాలేదు’ అన్నారు. దాశరథి, కాళోజీ కవితా పంక్తులను ఉటంకిస్తూ.. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement