జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకం

Uttam Kumar Reddy Appointed District Wise Coordinators - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం నియమించారు. అలాగే 4వ తేదిన జిల్లా కేంద్రాలలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ పీసీసీ కార్యదర్శిగా కొండేటి మల్లయ్య ను నియమిస్తూ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ప్రధాన కార్యదర్శి ని నియమిస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సిఫారసు రాగానే ప్రధాన కార్యదర్శిగా మార్పు చేస్తామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు.

జిల్లాల వారిగా కో ఆర్డనేటర్ల వివరాలు
 కోమరంభీం అసిఫాబాద్‌ జిల్లా నమిండ్ల శ్రీనివాన్‌
మంచిర్యాల జిల్లాకు ప్రేమలతఅగర్వాల్‌  
ఆదిలాబాద్‌ జిల్లాకు జి.నిరంజన్‌
 నిర్మల్‌ జిల్లాకు ఫిరోజ్ ఖాన్‌
 నిజామాబాద్‌ జిల్లాకు టి.నిరంజన్‌
  కామారెడ్డి జిల్లాకు మక్సూద్‌ అహ్మాద్‌
 జగిత్యాల జిల్లాకు గడుగు గంగాధర్
పెద్దపల్లి జిల్లాకు మహేశ్‌కుమార్‌ గౌడ్‌
కరీంనగర్‌ జిల్లాకు నర్సింహ్మరెడ్డి
 రాజన్నసిరిసిల్ల జి.సుజాత
 సంగారెడ్డి జిల్లాకు బక్కా జడ్సాన్‌
 మెదక్‌ జిల్లాకు నాగేశ్‌,
సిద్దిపేట జిల్లాకు గడ్డం ప్రసాద్‌కుమార్‌
రంగారెడ్డి జిల్లాకు జువ్వాడి ఇందిరారావు
 వికారాబాద్‌ జిల్లాకు జాఫర్‌ జావేద్‌
మేడ్చల్‌ జిల్లాకు వేణుగోపాల్‌రావు
 మహబూబ్‌నగర్‌ జిల్లాకు రంగారెడ్డి
నాగర్‌కర్నూల్‌ జిల్లాకు బొల్లు కిషన్‌
 వనపర్తి జిల్లాకు శ్రీనివాసరావు
 నారాయణపేటకు ఫయీమ్‌
 గద్వాల జిల్లాకు  అఫ్జలుద్దీన్‌
 సూర్యపేట ప్రేమ్‌లాల్‌
నల్లగొండ జిల్లాకు వినోద్‌కుమార్‌
 యాదాద్రి జిల్లాకు బండి నర్సాగౌడ్
 జనగాం జిల్లాకు జగదీశ్వర్‌ రావు
 మహబూబాబాద్‌ జిల్లాకు మానవతారాయ్‌
వరంగల్‌ రూరల్‌ జిల్లాకు అజ్మతుల్లా హుస్సేనీ
వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు బీ.ఎం.వినోద్‌కుమార్‌
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు పి.శ్రవణ్‌కుమార్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు డి.శ్రీధర్‌బాబు
ఖమ్మం జిల్లాకు ఆదాం సంతోష్‌కుమార్‌లను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమించారు,

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top