తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం

TS Governor Tamilisai Hosts AT Home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ సౌందరరాజన్‌ తమిళిసై ఆదివారం రాజ్‌భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు కేకే, నామా, సంతోష్ రావు, నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రముఖులతో ఈ కార్యక్రమం వైభవంగా సాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top