ట్రాన్స్‌పోర్టు డీసీఎం సోదా | Transport DCM Inspected | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌పోర్టు డీసీఎం సోదా

Jul 19 2018 1:56 PM | Updated on Jul 11 2019 8:44 PM

Transport DCM Inspected  - Sakshi

డీసీఎంలో సోదా చేస్తుండగా గుమిగూడిన స్థానికులు

లింగాల (అచ్చంపేట) : హైదరాబాద్‌ నుంచి మండల కేంద్రమైన లింగాలకు వచ్చిన ట్రాన్స్‌పోర్టు డీసీఎంను బుధవారం ఆకస్మికంగా ఎస్సైజ్‌ శాఖ వారు సోదాలు నిర్వహించారు. డీసీఎంలో హైదరాబాద్‌ నుంచి సారాకు వినియోగించే బెల్లం రవాణా అవుతుందన్న సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్‌ ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు జరిపారు. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న వివిధ నిత్యావసర సరకులను కిందకు దింపి పరిశీలించడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

సోదాలను వ్యాపారులు, ప్రజలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. డీసీఎం నుంచి దాదాపు 180 కిలోల బెల్లాన్ని ఎక్సైజ్‌ శాఖ వారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. అలాగే విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యాపారులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చేశామన్నారు.

ఇదిలా ఉండగా సోదాలను ఖండిస్తూ వ్యాపారులు దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. తాము ప్రజలు నిత్యం వాడుకునే తెల్లబెల్లం మాత్రమే విక్రయిస్తున్నామన్నారు. వ్యాపారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement