వైఎస్సార్ సీపీ సమరోత్సాహం
నరసరావుపేట: ఈనెల 13న జరిగే ఎన్నికల పోలింగ్లో ఏజెంట్లతో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పి.అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో వచ్చిన నాయకులు, కార్యకర్తలు తీన్మార్, బాణసంచా మోతల మధ్య మండుటెండను లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థులు రెడ్డినగర్లోని వరసిద్ధి వినాయకస్వామి, అభయాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు రోడ్డు, గడియారం స్థంభం, శివునిబొమ్మసెంటర్, మెయిన్రోడ్డు మీదగా మల్లమ్మసెంటర్ వరకు నిర్వహించారు. అక్కడి నుంచి ఓవర్ బ్రిడ్జి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రకాష్నగర్లోని పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. మధ్యలో ర్యాలీలో కార్యకర్తలతో కలసి డాక్టర్ గోపిరెడ్డి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం నడుపుతూ కనిపించారు. డాక్టర్ అనిల్కుమార్ యాదవ్ ర్యాలీలో నడుస్తూ ముందుకు సాగారు. పలు గ్రామాల నుంచి ట్రాక్టర్లతో రైతన్నలు పాల్గొన్నారు. టీడీపీ గుర్తు సైకిల్ను కొందరు యువకులు బైక్కు కట్టి ఈడ్చి ధ్వంసం చేశారు. దానిపై నుంచి ట్రాక్టర్లను రైతన్నలు నడిపారు. ఉప్పలపాడు గ్రామం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వచ్చి పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పౌడా చైర్మన్ మిట్టపల్లి రమేష్, పట్టణ కన్వీనర్ ఎస్ఏ హనీఫ్, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, ముదిరాజు, స్వచ్చాంధ్ర, గిరిజన, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్లు ఈఎం స్వామి, ఎస్.సుజాతాపాల్, పాలపర్తి వెంకటేశ్వరరావు, కందుల ఎజ్రా, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పడాల సాంబశివారెడ్డి, డాక్టర్లు కేజే మోహనరెడ్డి, కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండపల్లి వెంకటేశ్వర్లు, కొమ్మసాని కమలాకరరెడ్డి, కనకా పుల్లారెడ్డి, కాపులపల్లి ఆదిరెడ్డి, చల్లా నారపరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ ప్రచార రథంపై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్, డాక్టర్ గోపిరెడ్డి మండుటెండలో కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు