అంబర్ పేట్ మున్సిపల్ కాలనీలో ఓ వృద్దురాలు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.
అంబర్ పేట్ మున్సిపల్ కాలనీలో ఓ వృద్దురాలు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. నిన్న పంఛన్ కోసం వనస్థలి పురం వెళ్లిన సుగుణ(60) సాయంత్రం ఇంటికి వచ్చింది. కూతురు డ్యూటీ నుంచి తిరిగి వచ్చే సరికి ఆమె మృతి చెందింది. మృతురాలి వద్ద ఉన్న పది తులాల బంగారం, రూ 16 వేల నగదు కనిపించడం లేదు. నగదు కోసం ఎవరైనా హత్య చేసి ఉంటారని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సామాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.