రైతు ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్య

Oct 18 2015 8:42 PM | Updated on Sep 3 2017 11:10 AM

అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు

అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కోయగూడెంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు(32) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గతేడాది పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా పంట ఆశించిన విధంగా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement