హస్తినకు ఉత్తమ్ కుమార్ రెడ్డి | Telangana PCC Chief uttamkumar reddy went to Delhi | Sakshi
Sakshi News home page

హస్తినకు ఉత్తమ్ కుమార్ రెడ్డి

Mar 3 2015 10:01 AM | Updated on Mar 18 2019 7:55 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ ..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలను కలవనున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలపనున్నట్లు సమాచారం. కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి టీ.పీసీసీ పగ్గాలు ఇవ్వటం వెనక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చక్రం తిప్పినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement