పీఆర్‌సీ, ఐఆర్‌ ఈసారి కష్టమే! | Telangana Budget 2020 Has Not Allocated Funds For Implementation Of The PRC | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ, ఐఆర్‌ ఈసారి కష్టమే!

Mar 9 2020 3:47 AM | Updated on Mar 9 2020 3:47 AM

Telangana Budget 2020 Has Not Allocated Funds For Implementation Of The PRC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్‌సీ కోసం ఇంకొన్నా ళ్లు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. బడ్జెట్‌లో పీఆర్‌సీ అమలు కోసం నిధులను కేటాయిం చకపోవడంతో ఉద్యోగులు ఆందోళనలో పడ్డా రు.  ప్రస్తుత బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేకపోవ డంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మధ్యం తర భృతి (ఐఆర్‌) ప్రస్తావన కూడా లేక పోవడంతో తీవ్ర నిరాశ చెందారు. రాష్ట్రంలోని 2.62 లక్షల మంది ఉద్యోగులు, 2.68 లక్షల మంది పెన్షనర్లకు పీఆర్‌సీ అమలు చేయాల న్నా, ఐఆర్‌ ఇవ్వాలన్నా రూ.వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ మొత్తం వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం ఈ అంశానికి బడ్జెట్‌లో చోటు క ల్పించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థి క సంవత్సరం బడ్జెట్‌లోనే పీఆర్‌సీ అమలు అంశా న్ని చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉద్యో గుల రిటైర్‌మెంట్‌ వయసును 61 ఏళ్ల కు పెంచే అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గానే ఆలోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడం ద్వా రా ఉద్యోగులను కొంత శాంతపరిచే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement