నేటితో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర | sharmila paramarsa yatra of first session ends | Sakshi
Sakshi News home page

నేటితో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర

Jan 27 2015 1:33 PM | Updated on Sep 2 2017 8:21 PM

నేటితో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర

నేటితో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన తొలిదశ పరామర్శయాత్ర మంగళవారంతో ముగిసింది.

నల్గొండ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టిన తొలిదశ పరామర్శయాత్ర మంగళవారంతో ముగిసింది. ఏడురోజుల పాటు జిల్లాలో పర్యటించిన ఆమెకు వైఎస్సార్ అభిమానులు బ్రహ్మరధం పట్టారు. వైఎస్సార్ ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను  పరామర్శించడానికి షర్మిల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలోనే షర్మిల ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను పరామర్శించారు. షర్మిల పరామర్శ యాత్రపై బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement