కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు | Shahdnagar RDO Gives Show Cause Notices To Keshampeta, Kondurga Tahsildars | Sakshi
Sakshi News home page

కేశంపేట, కొందుర్గు తహసీల్దార్లకు నోటీసులు

Sep 14 2019 1:07 PM | Updated on Sep 14 2019 1:07 PM

Shahdnagar RDO Gives Show Cause Notices To Keshampeta, Kondurga Tahsildars - Sakshi

సాక్షి, రంగారెడ్డి: సకాలంలో మ్యుటేషన్‌ కేసులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు తహసీల్దార్లకు షాద్‌నగర్‌ ఆర్డీఓ కృష్ణ షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లో పరిష్కారం చేయాల్సిన ఈ కేసులను రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో ఆర్డీఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అప్పటి జాయింట్‌ కలెక్టర్, ప్రస్తుత ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సిన కేశంపేట ఇన్‌చార్జి తహసీల్దార్‌ బి.ఆంజనేయులు, కొందుర్గు తహసీల్దార్‌ ఎం.కృష్ణారెడ్డి పెడచెవిన పెట్టారు. కేశంపేటలో 216, కొందుర్గు మండలంలో 134 మ్యుటేషన్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ ఆ ఇద్దరు తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించడంలో ఎందుకు విఫలమయ్యారో పేర్కొంటూ 24 గంటల్లోగా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement