గ్రూపు రాజకీయాలు మానుకోవాలి | seniors should quit groupism, say congress leaders | Sakshi
Sakshi News home page

గ్రూపు రాజకీయాలు మానుకోవాలి

Aug 25 2014 3:25 PM | Updated on Mar 18 2019 7:55 PM

సీనియర్ నాయకులు గ్రూపు రాజకీయాలను విడనాడి కార్యకర్తలను పట్టించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

సీనియర్ నాయకులు గ్రూపు రాజకీయాలను విడనాడి కార్యకర్తలను పట్టించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయిందని, దీనికి నేతలందరూ బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ప్రచార లోపమే ఓటమికి కారణమని, ఇప్పటికైనా నేతల మధ్య ఐక్యత అవసరమని చెప్పారు.

ఇప్పుడు పార్టీని పునర్‌నిర్మించుకోవాలని, ఎందుకు ఓడిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని, తరచుగా సమీక్షాసమావేశాలు జరగాలని ఎంపీ రాపోలు అనంతభాస్కర్ అభిప్రాయపడ్డారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అసలు పార్టీలో ఉన్నవారు ఎవరో, లేనివారు ఎవరో స్పష్టత లేదని.. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా మాజీ  మంత్రులను నియమించాలని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసినవారిని ఏరివేయాలని, వారందరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement