హైకోర్టు విభజనపై నోటిఫికేషన్‌ విడుదల

President Ramnath Kovind Issued Notification For Bifurcation Of High Court Of Judicature At Hyderabad - Sakshi

ఏపీకి 16 మంది జడ్జీల కేటాయింపు

తెలంగాణకు 11 మంది జడ్జీల కేటాయింపు

సాక్షి, న్యూఢిల్లీ : ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి హైకోర్టు నుంచి 16 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు, 10 మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. ఆ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేయనున్నాయి.

ఏపీ హైకోర్టుకు కేటాయించిన జడ్జిలు
1. జస్టిస్ రమేశ్ రంగనాథన్ (ప్రస్తుతం ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు)
2. జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్
3. జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్టి
4. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి
5. జస్టిస్ దామ శేషాద్రినాయుడు
6. జస్టిస్  మాదాత సీతారామమూర్తి
7. జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు
8. జస్టిస్ తాళ్లూరు సునీల్ చౌదరి
9. జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి
10. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్
11. జస్టిస్ కుమారి జవలాకర్ ఉమాదేవి
12. జస్టిస్ నక్కా బాలయోగి
13. జస్టిస్ శ్రీమతి తేలప్రోలు రజిని
14. జస్టిస్ దుర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు
15. జస్టిస్ శ్రీమతి కొంగర విజయ లక్ష్మి
16. జస్టిస్ మాతోజ్ గంగారావు

తెలంగాణకు కేటాయించిన జడ్జిలు
1. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్
2. జస్టిస్ మామిడాల సత్యరత్న శ్రీరామచంద్రరావు
3. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి
4. జస్టిస్ పొనుగోటి నవీన్ రావు
5. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి
6. జస్టిస్ బులుసు శివ శంకర్‌రావు
7. జస్టిస్ డా. షమీమ్ అఖ్తర్
8. జస్టిస్ పొట్లపల్లి కేశవ రావు
9. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
10. జస్టిస్ తోడుపునూరి అమర్‌నాథ్ గౌడ్
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top