టీఆర్‌ఎస్ ప్లీనరీని జయప్రదం చేయాలి | Politics-TS-TRS-Plenary | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ప్లీనరీని జయప్రదం చేయాలి

Apr 23 2015 12:25 AM | Updated on Sep 3 2017 12:41 AM

ఈనెల 24న జరగనున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్లీనరీ, 27న జరిగే పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని

 టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా
 ప్రతి నియోజకవర్గంనుంచి 300మందికి మించకుండా ప్లీనరీకి రావాలి
 బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మంది తరలింపు
 
 నకిరేకల్ : ఈనెల 24న జరగనున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్లీనరీ, 27న జరిగే పార్టీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కోరారు. నకిరేకల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మాట్లాడారు. ప్లీనరీకి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 300మందికి మించకుండా హాజరు కావాలని చెప్పారు.  27న జరిగే బహిరంగ సభలో జిల్లా నుంచి లక్ష మంది టీఆర్‌ఎస్ శ్రేణులు హాజరయ్యేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నల్లగొండ జిల్లా త్వరలోనే టీఆర్‌ఎస్‌కు పెట్టిన కోటగా మారబోతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా నాయకులు అమరేందర్‌రెడ్డి,  పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, ఎం పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యానాల పాపిరెడ్డి, కోక యాదయ్య,  టీఆర్‌ఎస్ మండల, పట్టణ శాఖ అధ్యక్షులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement