‘కోడ్’ను మరిచారు..!
సాక్షి, మంచిర్యాల: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సంగతి తెలిసిందే! అయినా, మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో వివిధ పార్టీల దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడం మరిచారు. పలు ప్రభుత్వ పథకాల ప్రచార ఫ్లెక్సీలు కూడా అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి.