రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 17మందికి గాయాలయ్యాయి.
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణ పేట మండలం అప్పస్పల్లి సమీపంలో శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 17మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.