గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం, అవగాహన పెంపొందించేలా వార్తా కథనాలు అందించిన ప్రింట్,
ఎంట్రీలు ఆహ్వానించిన ఎన్నికల సంఘం
సాక్షి, హైదరాబాద్: గత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం, అవగాహన పెంపొందించేలా వార్తా కథనాలు అందించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు ‘నేషనల్ మీడియా అవార్డ్ ఫర్ బెస్ట్ కాంపైన్ ఆన్ ఓటర్స్’ పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2015 జనవరి 25న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు చెరో పురస్కారాన్ని అందిస్తామని తెలిపింది. ఈ నెల 30వ తేదీలోగా ఢిల్లీలోని తమ కార్యాలయానికి పూర్తి వివరాలతో ఎంట్రీలను పంపాలని సూచించింది.